News September 2, 2025
ఆగస్టులో రూ.1.86 లక్షల కోట్ల GST వసూళ్లు

కేంద్రం ఆగస్టులో రూ.1.86 లక్షల కోట్ల GST కలెక్ట్ చేసింది. గతేడాది AUGతో పోల్చితే 6.5% పెరుగుదల నమోదైంది. అయితే జులై వసూళ్ల(రూ.1.96 లక్షల కోట్లు)తో చూస్తే తక్కువే. పెద్ద రాష్ట్రాల్లో రూ.28,900 కోట్ల కలెక్షన్స్తో మహారాష్ట్ర టాప్లో నిలిచింది. గ్రోత్ రేట్ పరంగా సిక్కిమ్(39%) ముందుంది. ఓవరాల్గా ఈ ఏడాది ఏప్రిల్లో రికార్డు స్థాయిలో రూ.2.37 లక్షల కోట్ల ట్యాక్స్ వసూలైన విషయం తెలిసిందే.
Similar News
News January 26, 2026
కొబ్బరిపాలతో చర్మ సంరక్షణ

వంటల్లో ఎక్కువగా వాడే కొబ్బరి పాలు సౌందర్య సంరక్షణలో కూడా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, కాపర్ చర్మంపై మృతకణాలను తొలగిస్తాయి. దాంతో పాటు ముడతలు, మచ్చలు తగ్గించి యవ్వన చర్మాన్ని ఇస్తాయి. మొటిమలు, ఎగ్జిమా, సొరియాసిస్ వంటి చర్మ సమస్యలను తగ్గిస్తాయని చెబుతున్నారు. అలాగే వీటిని జుట్టుకు పట్టిస్తే కుదుళ్లను దృఢంగా చేస్తాయని చెబుతున్నారు.
News January 26, 2026
నేడు భీష్మాష్టమి.. ఇలా చేస్తే సంతాన ప్రాప్తి!

మాఘ శుద్ధ అష్టమి(భీష్మాష్టమి) రోజునే భీష్ముడు మోక్షం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర దినాన ఆయనకి తర్పణం సమర్పిస్తే ఉత్తమ సంతాన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ‘తండ్రి బతికున్న వారు కూడా ఈ తర్పణం సమర్పించవచ్చు. తెలుపు దుస్తులతో విష్ణుమూర్తిని ఆరాధిస్తే పుణ్యఫలాలు లభిస్తాయి’ అని సూచిస్తున్నారు. భీష్మ తర్పణం ఎలా సమర్పించాలి, భీష్మ అష్టోత్తర వివరాల కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News January 26, 2026
బీర పంటకు నీటిని ఇలా అందిస్తే మేలు

బీర విత్తనాలను నాటడానికి ముందు పొలంలో నీరు పెట్టాలి. తర్వాత ప్రతి 3 నుంచి 4 రోజులకు ఒకసారి గింజ మొలకెత్తే వరకు నీరు పెట్టాలి. ఆ తర్వాత పాదు చుట్టూ 3-5 సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా ఉన్నప్పుడు నీరు ఇవ్వాలి. వేసవి పంటకు నాలుగైదు రోజులకు ఒకసారి నీరు అందించాలి. మొక్కకు దగ్గరగా కాకుండా కాస్త దూరంలో ఎరువు వేయాలి. తర్వాత ఎరువుపై మట్టిని కప్పి నీటిని పెట్టడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.


