News September 9, 2024

కీలక నిర్ణయాన్ని వాయిదా వేసిన జీఎస్టీ కౌన్సిల్!

image

జీవిత, ఆరోగ్య బీమాపై జీఎస్టీ తగ్గింపు విష‌యంలో కౌన్సిల్ త‌న నిర్ణ‌యాన్ని వాయిదా వేసిన‌ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం, పాలసీదారులు తమ ప్రీమియంలపై 18% GST చెల్లిస్తున్నారు. ఈ స‌మావేశంలో పాల‌సీదారుల‌కు ఊర‌ట క‌ల్పిస్తార‌ని అంద‌రూ ఆశించారు. అయితే, కౌన్సిల్ తదుపరి సమావేశంలో దీనిని పున:సమీక్షించాలనే ఆలోచనతో చర్చను వాయిదా వేసిన‌ట్టు తెలిసింది. దీంతో పాల‌సీదారులు మ‌రికొన్ని రోజులు వేచిచూడాల్సిన ప‌రిస్థితి.

Similar News

News January 6, 2026

SC, STలకు ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: గొట్టిపాటి

image

AP: సోలార్ రూఫ్ టాప్ పథకానికి టెండర్లు పూర్తి చేసినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ‘సోలార్ రూఫ్‌ టాప్‌కి రూ.78వేల వరకు రాయితీ ఉంటుంది. BCలకు అదనంగా మరో రూ.20వేలు, SC, STలకు ఫ్రీగా ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. కేంద్రం కొన్ని రాష్ట్రాల ఇంధనశాఖ మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి విద్యుత్‌ రంగ ప్రైవేటీకరణ అంశంపై చర్చ నిర్వహించింది. దీనికి కూటమి ప్రభుత్వం పూర్తి వ్యతిరేకం’ అని తెలిపారు.

News January 6, 2026

తత్కాల్ టికెట్ బుకింగ్ టిప్.. ఈ ఫీచర్‌తో పని ఈజీ!

image

IRCTCలో తత్కాల్ టికెట్ త్వరగా బుక్ అవ్వాలంటే Master List ఫీచర్ వాడొచ్చు. ‘My Profile’లో ప్రయాణికుల పేర్లు, వయసు, ఆధార్ వివరాలను ముందే సేవ్ చేసుకోవచ్చు. దీనివల్ల బుకింగ్ టైమ్‌లో మళ్లీ టైప్ చేసే పని ఉండదు. కేవలం ఒక్క క్లిక్‌తో ప్యాసింజర్ డీటెయిల్స్ యాడ్ అవుతాయి. టైమ్ ఆదా అవ్వడమే కాకుండా తత్కాల్ సీటు దొరికే ఛాన్స్ పెరుగుతుంది. గరిష్ఠంగా 12 మంది వివరాలను ఇందులో స్టోర్ చేసుకోవచ్చు.

News January 6, 2026

బంగారు పేపర్లతో భగవద్గీత

image

కర్ణాటకలోని ప్రసిద్ధ ఉడుపి శ్రీకృష్ణ మఠానికి అపురూపమైన కానుక అందింది. ఢిల్లీకి చెందిన ఓ భక్తుడు రూ.2 కోట్ల విలువైన బంగారు పేపర్లతో రూపొందించిన స్వర్ణ భగవద్గీతను సమర్పించారు. 18 అధ్యాయాలు, 700 శ్లోకాలతో రూపొందిన ఈ గ్రంథాన్ని విశ్వగీతా పర్యాయ ముగింపు రోజున మఠాధిపతి విద్యాధీశతీర్థ స్వామికి అందజేయనున్నారు. ఈ నెల 8న బంగారు రథంలో ఊరేగింపుగా తీసుకొచ్చి మఠానికి బహూకరించనున్నారు.