News August 2, 2024
GST: ఏపీలో తగ్గుదల.. తెలంగాణలో పెరుగుదల

జులై నెలలో GST వసూళ్లు రూ.1.82 లక్షల కోట్లు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. గత ఏడాది ఇదే నెలలో రూ.1.74 లక్షల కోట్లు వసూలవగా, ఈసారి 10 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జులై వరకు రూ.6.56 లక్షల కోట్లు వసూలైంది. తెలంగాణలో గత నెలలో 2 శాతం వృద్ధితో రూ.4,940 కోట్లు, ఏపీలో 7 శాతం తగ్గుదలతో రూ.3,346 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి.
Similar News
News February 7, 2026
వెండితెరపై తండ్రీకూతుళ్ల జోరు!

సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకూ తండ్రీకొడుకుల కాంబోలు చూశాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. 2026లో తండ్రీకూతుళ్ల జోరు సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత ‘మన శంకర వరప్రసాద్ గారు’తో నిర్మాతగా సత్తా చాటగా గుణశేఖర్ కుమార్తె నీలిమ ‘యుఫోరియా’ను నిర్మించారు. రవితేజ డాటర్ మోక్షద ‘ఇరుముడి’ నిర్మాణ బాధ్యతలు చూస్తుంటే నటుడు అర్జున్ తన కుమార్తె ఐశ్వర్య హీరోయిన్గా ‘సీతా పయనం’ను తెరకెక్కిస్తున్నారు.
News February 7, 2026
TENTH: ఇంగ్లిష్ ఎగ్జామ్ తేదీ మార్పు

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు జరిగింది. ఇంగ్లిష్ పరీక్షను మార్చి 20న కాకుండా 21న (శనివారం) నిర్వహించనున్నట్లు ఎస్సెస్సీ బోర్డు అధికారికంగా ప్రకటించింది. 20న రంజాన్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. మిగతా అన్ని పరీక్షలు ముందుగా ప్రకటించిన టైమ్ టేబుల్ ప్రకారమే యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేసింది. కాగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి.
News February 7, 2026
ముంబై: బీజేపీకి మేయర్, శివసేనకు డిప్యూటీ మేయర్

ముంబై మేయర్గా బీజేపీ కార్పొరేటర్ రితూ తావ్డే పేరును ఆ పార్టీ ప్రకటించింది. డిప్యూటీ మేయర్గా శివసేన కార్పొరేటర్ సంజయ్ శంకర్ ఘాడీని ఎంపిక చేశారు. కాగా 227 స్థానాలు ఉన్న ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో మహాయుతి కూటమి 118 చోట్ల (బీజేపీ- 89, శివసేన- 29) విజయం సాధించింది. దీంతో 25 ఏళ్ల తర్వాత ముంబై పీఠంపై శివసేన (UBT) పట్టు కోల్పోయింది.


