News March 24, 2024
ముంబైపై గుజరాత్ విజయం
అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచులో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 168 రన్స్ చేసింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 20 ఓవర్లలో 162 పరుగులకే పరిమితమైంది. చివర్లో గుజరాత్ బౌలర్లు రషీద్, జాన్సన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ విజయాన్ని సొంతం చేసుకుంది.
Similar News
News October 3, 2024
భారత్లోనే ఖో ఖో తొలి వరల్డ్ కప్
మొట్టమొదటి ఖో ఖో వరల్డ్ కప్ వచ్చే ఏడాది భారత్లో జరగనుంది. ఇందులో 24 దేశాల నుంచి 16 పురుష, 16 మహిళల జట్లు పాల్గొననున్నాయి. ఖో ఖోకు భారత్ పుట్టినిల్లు అని, ఈ వరల్డ్ కప్ దాని ఔన్నత్యాన్ని, సంప్రదాయ వారసత్వాన్ని హైలైట్ చేస్తుందని ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (KKFI) తెలిపింది. 2032 నాటికి ఖో ఖోను ఒలింపిక్ స్పోర్ట్గా చూడటం తమ కల అని, అందుకు ఈ ప్రపంచకప్ దోహదం చేస్తుందని పేర్కొంది.
News October 3, 2024
పెరిగిన Gold Loans డామినేషన్
FY25 ఫస్ట్ క్వార్టర్లో NBFCలు పర్సనల్ లోన్లతో పోలిస్తే గోల్డ్ లోన్లనే ఎక్కువగా సాంక్షన్ చేశాయని FIDC తెలిపింది. ఇవి YoY 26% పెరిగి రూ.79,218 కోట్లకు చేరాయంది. గత ఏడాది రూ.63,495 కోట్లతో పర్సనల్ లోన్లే టాప్లో ఉన్నాయి. అన్ సెక్యూర్డ్ లోన్లపై RBI గత నవంబర్లో వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడవి రెండో స్థానానికి చేరాయి. హౌసింగ్ లోన్స్, ప్రాపర్టీ లోన్స్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
News October 3, 2024
వారికి 2BHK ఇళ్లతో పాటు రూ.25వేలు
TG: హైదరాబాద్ మూసీ రివర్ బెడ్ నిర్వాసితులకు 2BHK ఇళ్లతో పాటు సామగ్రి తరలింపు, ఇతర ఖర్చుల కోసం రూ.25వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు HYD, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు తాజాగా ప్రకటన విడుదల చేశారు. ఒక్కో నిర్వాసిత కుటుంబానికి రూ.25వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే వారి సమస్యల పరిష్కారానికి ఆయా జిల్లాల్లో గ్రీవెన్ సెల్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.