News May 22, 2024

నైజీరియాలో సాయుధమూకల కాల్పులు.. 40 మంది మృతి

image

నైజీరియాలోని పీట్లా రాష్ట్రంలో సాయుధమూకలు నరమేధం సృష్టించాయి. వాసే జిల్లాలోని జురాక్ మైనింగ్ గ్రామంపై విరుచుకుపడి కాల్పులు జరపడంతో పాటు ఇళ్లను తగులబెట్టారు. ఈ ఘటనలో 40 మంది మృతి చెందారు. కాగా గనులకు ప్రసిద్ధి చెందిన పీట్లా రాష్ట్రంలో వనరులపై ఆధిపత్యం కోసం తరచూ ఘర్షణలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో గ్రామాలపై దాడులు చేసి దోచుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు వీళ్ల దాడిలో వేల మంది చనిపోయారు.

Similar News

News January 31, 2026

నిర్మల్: బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలి

image

ఓటరు ప్రోజెని మ్యాపింగ్ ప్రక్రియలో వేగం పెంచాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు ప్రోజెని మ్యాపింగ్ ప్రక్రియలో వేగం పెంచాలని ఆదేశించారు. 2002 వివరాలతో ప్రస్తుత వివరాలు సరి పోల్చి మ్యాపింగ్ ప్రక్రియను తర్వాతగతిన పూర్తి చేయాలన్నారు. బూత్ స్థాయి అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో వెళ్లి ప్రక్రియను చేపట్టాలని సూచించారు.

News January 31, 2026

నాకు ఇచ్చిన నోటీసు అక్రమం.. KCR లేఖ

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ ACPకి కేసీఆర్ 6 పేజీల లేఖ రాశారు. ‘నాకు ఇచ్చిన నోటీసు అక్రమం. దాని ద్వారా నా గౌరవానికి భంగం కలిగించారు. ఇంటి గోడకు నోటీసు అంటించడం చట్టవిరుద్ధం. నేను కొన్ని సంవత్సరాలుగా ఎర్రవల్లిలో నివసిస్తున్నా. అక్కడే స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. చట్టపరమైన అభ్యంతరాలున్నా రేపు 3PMకు నందినగర్ నివాసంలో సిట్ విచారణకు హాజరవుతా’ అని లేఖలో పేర్కొన్నారు.

News January 31, 2026

రూ.5వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లాగేశారు: జగన్

image

AP: విశాఖలో చంద్రబాబు, ఆయన కుటుంబం దాదాపు రూ.5వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లాగేసుకుందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. రుషికొండ సమీపంలోని 54.79 ఎకరాల భూములను ఎంపీ భరత్‌కు కట్టబెట్టేశారని ట్వీట్ చేశారు. లోకేశ్‌కు ఎలాంటి అధికార పరిధి లేకపోయినా తోడల్లుడికి కేటాయించేలా చేశారని తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు ఒత్తిళ్లతో GVMC సభ్యులను భయపెట్టి ఏకపక్షంగా ఆమోదించుకున్నారని పేర్కొన్నారు.