News March 18, 2024
గుంటూరు: విద్యార్థులకు RTCలో ఉచిత ప్రయాణం
నేటినుంచి జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ప్రకటించింది. బస్సులో పరీక్షా కేంద్రానికి రాకపోకలు సాగించే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ ప్రజా రవాణా అధికారి నర్రా శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు.
Similar News
News February 3, 2025
నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు: ఎస్పీ
గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ కోడ్ అమలులో ఉన్నందున జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి అర్జీలు ఇచ్చేందుకు వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించి రావద్దని కోరారు.
News February 1, 2025
గుంటూరు: 63.4% మేర జరిగిన పింఛన్ల పంపిణీ
గుంటూరు జిల్లాలో ఫిబ్రవరి నెలకు సంబంధించిన NTR భరోసా పింఛన్ల పంపిణీ శనివారం ఉదయం 10 గంటల వరకు 63.4% మేర పంపిణీ అయ్యింది. జిల్లాలో 2,53,464 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా 1,60,700 మందికి ప్రభుత్వ యంత్రాంగం పింఛన్ అందజేసినట్లు అధికారిక డాష్బోర్డు ద్వారా తెలుస్తోంది. కాగా జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పింఛన్ పంపిణీకి రాజకీయ పక్షాల నేతలు దూరంగా ఉన్నారు.
News February 1, 2025
కేక్ కొనేందుకు వెళుతూ ముగ్గురు స్పాట్ డెడ్
గుంటూరు జిల్లా ఏటుకూరు గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కొర్నేపాడు గ్రామానికి చెందిన స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా ముగ్గురు స్నేహితులు ఒకే బైక్పై కేక్ కొనుగోలు చేసేందుకు వెళుతూ.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొని మరణించారు. ఈ ప్రమాదంతో ముగ్గురు కుటుంబాల్లో విషాదం నెలకొంది. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానిక పోలీసులు తెలిపారు.