News September 22, 2025

రాష్ట్ర ఉత్సవంగా గురజాడ జయంతి: కొండపల్లి

image

AP:సమాజంలోని దురాచారాలను తన రచనలతో మార్చిన మహాకవి గురజాడ అప్పారావు జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తోందన్నారు. 150 ఏళ్లైనా ఆయన రచనలు, సాహిత్యం ఇంకా ప్రజాదరణ పొందుతున్నాయని తెలిపారు. గురజాడ జయంతి సందర్భంగా VZMలో ఆయన ఇంటిని సందర్శించిన మంత్రి, MP కలిశెట్టి దాని ఆధునికీకరణ, గ్రంథాలయ నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయించారు.

Similar News

News September 22, 2025

యంత్ర ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>యంత్ర<<>> ఇండియా లిమిటెడ్(మహారాష్ట్ర) 2 సీనియర్, 3 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 4 లోపు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ICAI, ICMAI, HSSC, CA, CMA విద్యార్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు గరిష్ఠ వయసు 40ఏళ్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు గరిష్ఠ వయసు 50ఏళ్లు. https://ddpdoo.gov.in/

News September 22, 2025

మహిళలు కాళ్లకు పసుపు ఎందుకు రాస్తారంటే..

image

పసుపు రాసుకోవడానికి సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ఆరోగ్యకారణాలున్నాయి. దీన్ని పూజల్లో, ఆహారంలో వాడటంతో పాటు ప్రత్యేక పర్వదినాల్లో కాళ్లకు, ముఖానికి రాసుకుంటారు. దీనివెనక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. పసుపు చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు గాయాలను మాన్పిస్తుంది. మహిళలు నీటిలో పనిచేయడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు, కాళ్లనొప్పులు, వాపులను పసుపు నిరోధిస్తుంది. అందుకే మహిళలు దీన్ని రాసుకుంటారు.

News September 22, 2025

వేరుశనగలో ముదురు ఆకుమచ్చ తెగులు లక్షణాలు

image

వేరుశనగలో ముదురు ఆకుమచ్చ తెగులు పంట నాటిన 25 నుంచి 35 రోజుల తర్వాత ఎప్పుడైనా ఆశించవచ్చు. ఉష్ణోగ్రతలు తగ్గడం, ఆకులపై మంచు ఉండటం, అధిక వర్షం, అధిక నత్రజని వాడకం, మెగ్నీషియం లోపం ఈ తెగులు వ్యాప్తికి కారణమవుతుంది. ఈ తెగులు వల్ల ఆకుల అడుగు భాగం, కాండం, ఊడలపైనా ముదురు రంగులో గుండ్రని మచ్చలు కనిపిస్తాయి. తర్వాత దశలో ఈ మచ్చలు అన్నీ ఒక దానితో ఒకటి కలిసిపోయి ఆకులు పండుబారి రాలిపోతాయి.