News March 17, 2024
గుర్ల: గుర్తు తెలియని మృతదేహం కలకలం

మండలంలోని జమ్ము గ్రామంలో రైలు పట్టాలపై గుర్తుతెలియని మృత దేహం లభ్యమయిందని రైల్వే హెచ్సీ చక్రధర్ ఆదివారం తెలిపారు. మృతుడి వయసు 50ఏళ్లు ఉంటుందన్నారు. జేబులో హౌరా నుంచి విజయవాడకు వెళ్తున్నట్లు టికెట్ ఉందన్నారు. బహుశా ట్రైన్ నుంచి జారి పడి 3రోజుల కిందట మరణించి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చీపురుపల్లి పీహెచ్సీకి తరలించామని తెలియజేశారు.
Similar News
News March 29, 2025
అనుమానస్పద స్థితిలో యువతి మృతి

అనుమానస్పద స్థితిలో యువతి మృతి చెందిన సంఘటన సాలూరు మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. సాలూరు రూరల్ SI నరసింహమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కందులపథం పంచాయతీ చిన్నవలస గ్రామానికి చెందిన ఐశ్వర్య(20) చీపురువలస సమీపంలోని జీడి తోటలో అనుమానస్పద స్థితిలో మృతి చెందారని తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు. ఓ యువకుడిపై అనుమానంతో అతని కోసం గాలిస్తున్నారు.
News March 29, 2025
ఈ నెల 31న గ్రీవెన్స్ రద్దు: కలెక్టర్ అంబేద్కర్

ఈ నెల 31వ తేదీన సోమవారం రంజాన్ పండుగ సందర్భంగా, కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు. ఆ రోజున మండల కార్యాలయాల్లో కూడా గ్రీవెన్స్ ఉండదన్నారు.
News March 29, 2025
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు: VZM SP

విజయనగరం మహిళా పోలీసు స్టేషన్లో 2021లో నమోదైన పోక్సో కేసులో విజయనగరం పట్టణం గోకపేటకు చెందిన నిందితుడు కంది సన్యాసిరావు(19)కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కే.నాగమణి ఈ మేరకు తీర్పు ఇచ్చినట్లు శుక్రవారం తెలిపారు. రూ.10,500 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో బాగా పనిచేసిన అధికారులను ఎస్పీ అభినందించారు.