News March 29, 2025
గురుకుల ఫలితాలు విడుదల

TG: రాష్ట్రంలోని SC, ST, BC గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష(స్పెషల్ కేటగిరీ) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ విభాగంలో 13,927 మంది విద్యార్థులు పరీక్ష రాయగా తొలి దశలో 1,944 మంది సీట్లు సాధించారని అధికారులు తెలిపారు. అలాగే ఐదు నుంచి 9వ తరగతి వరకు పరీక్ష రాసిన విద్యార్థుల మొదటి దశ మెరిట్ లిస్టును కూడా రిలీజ్ చేసినట్లు చెప్పారు.
వెబ్సైట్: https://www.tgswreis.telangana.gov.in/
Similar News
News December 30, 2025
కంకి ఎర్రనైతే కన్ను ఎర్రనౌతుంది

వరి పంట పండే సమయంలో కంకి (వరి వెన్ను) సహజంగా బంగారు వర్ణంలో ఉండాలి. కానీ, విపరీతమైన వర్షాలు కురిసినా లేదా ఏదైనా తెగులు సోకినా కంకులు ఎర్రగా మారిపోతాయి. దీనివల్ల ధాన్యం నాణ్యత దెబ్బతింటుంది. కష్టపడి పండించిన పంట కళ్లముందే పాడైపోవడం చూసి రైతు కన్ను ఎర్రనౌతుంది (అంటే దుఃఖంతో కన్నీళ్లు వస్తాయి). పంట దిగుబడి, స్థితికి.. రైతు మనస్తత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ సామెత తెలియజేస్తుంది.
News December 30, 2025
119 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News December 30, 2025
ఈరోజు అస్సలు చేయకూడని పనులు

ఈ రోజున తులసి మొక్కను తాకడం, ఆకులు కోయడం చేయకూడదని పండితులు చెబుతున్నారు. ‘పూజకు కావాల్సిన తులసిని ముందు రోజే కోసి ఉంచుకోవాలి. అన్నం/బియ్యంతో తయారైనవి అస్సలు తినకూడదు. మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి. పగలు నిద్రించడం వల్ల పుణ్యఫలం తగ్గుతుంది. ఎవరినీ దూషించకూడదు. గొడవలు పడకూడదు. ప్రతికూల ఆలోచనలు వీడి, మనసును పూర్తిగా ఆ శ్రీహరి నామస్మరణపైనే లగ్నం చేయాలి’ అంటున్నారు.


