News August 11, 2025

జిల్లాల పేర్లు, హద్దుల మార్పుపై 13న జీవోఎం భేటీ: అనగాని

image

AP: జిల్లా, మండలాల పేర్లు, సరిహద్దుల మార్పుపై ఈనెల 13న GOM భేటీ కానుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ‘గత ప్రభుత్వం జిల్లాల పున:వ్యవస్థీకరణను అడ్డదిడ్డంగా చేసింది. వాటి సరిహద్దులు, పేర్లు మార్చాలని ప్రజలు కోరుతున్నారు. ఇంకా అర్జీలుంటే ఇవ్వొచ్చు. వీటిపై చర్చించి ప్రభుత్వానికి నివేదిస్తాం’ అని వెల్లడించారు. GOMలో నారాయణ, అనిత, జనార్దన్‌, నిమ్మల, మనోహర్, సత్యకుమార్ ఉన్నారు.

Similar News

News August 11, 2025

క్రైం న్యూస్ రౌండప్

image

* హైదరాబాద్ ORRపై వాహనం ఢీకొని ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు మృతి. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు
* విశాఖ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం. బ్రేకులు ఫెయిలై ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లడంతో మహిళ దుర్మరణం, మరొకరికి తీవ్రగాయాలు
* వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం. కార్మికుడి మృతి

News August 11, 2025

సైబర్ నేరగాళ్లకు షాక్.. వెంటనే సిమ్ బ్లాక్

image

సైబర్ నేరగాళ్ల సిమ్ కార్డులను వెంటనే బ్లాక్ చేసేలా ఎస్పీలకు కేంద్ర ప్రభుత్వం అధికారం ఇవ్వనుంది. అనుమానితుల లొకేషన్లు, బ్యాంకు, టెలికాం వివరాలను తక్షణమే అన్ని పీఎస్‌లకు పంపేలా చర్యలు చేపట్టనుంది. దేశ వ్యాప్తంగా సైబర్ క్రైమ్‌పై ప్రజల్లో అవగాహన పెంచేలా చర్యలు తీసుకోనుంది. అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు తెలంగాణను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. త్వరలోనే TGలో సెమినార్ నిర్వహించనుంది.

News August 11, 2025

AP DSC ఫలితాలు విడుదల

image

ఏపీ డీఎస్సీ ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్థులు ఇక్కడ <>క్లిక్<<>> చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం గతంలో 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా జూన్ 6 నుంచి జులై 2 వరకు పరీక్షలు జరిగాయి. 92.90శాతం మంది హాజరయ్యారు. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు.