News February 2, 2025
GVMCలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక తాత్కాలిక రద్దు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎన్నికల సందర్భంగా GVMCలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు చేసినట్లు జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 29 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ రద్దు చేసినట్లు తెలిపారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
Similar News
News December 29, 2025
విశాఖకు 150 పర్యావరణహిత బస్సులు

కేంద్ర ప్రభుత్వ ‘పీఎం-ఈబస్ సేవ’ పథకం కింద రాష్ట్రానికి 750 విద్యుత్ బస్సులు కేటాయించగా.. ఇందులో విశాఖపట్నం నగరానికే అత్యధికంగా 150 బస్సులను అందిచనుండడం విశేషం. ఈ మేరకు ఆపరేటర్లను ఖరారు చేసేందుకు ఈఈఎస్ఎల్ (EESL) సంస్థ ఆర్టీసీకి లెటర్ ఆఫ్ అవార్డు జారీ చేసింది. త్వరలోనే పర్యావరణ హితమైన ఈ ఎలక్ట్రిక్ బస్సులు వైజాగ్ రోడ్లపై పరుగులు తీయనున్నాయి.
News December 29, 2025
విశాఖలో ఆగని కుక్కల దాడులు!

జీవీఎంసీ పరిధిలో వీధి కుక్కల దాడులు ఆగడం లేదు. సింథియాలో ఈ నెల 21 నుంచి ఇప్పటివరకు 20 మందిపై కుక్కలు దాడి చేశాయి. GVMC పరిధిలో 2లక్షల వరకు కుక్కలు ఉన్నట్లు అంచనా. వాటి నియంత్రణ కోసం అరిలోవ, కాపులుప్పడ, సవరాల ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి కుక్కల ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు వెటర్నరీ అధికారి రాజ రవికుమార్ తెలిపారు. రోజుకు 50 నుంచి 60 వరకు కుక్కల ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని చెప్పారు.
News December 29, 2025
గాజువాక: ఉరి వేసుకుని బాలుడి ఆత్మహత్య

గాజువాక డిపో 59 వార్డు నక్కవానిపాలెంలో ఓ బాలుడు ఉరివేసుకొని మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో యుగంధర్ వర్మ (16) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గాజువాక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. బాలుడి అత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


