News February 2, 2025

GVMCలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక తాత్కాలిక రద్దు

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎన్నికల సందర్భంగా GVMCలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు చేసినట్లు జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 29 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ రద్దు చేసినట్లు తెలిపారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

Similar News

News January 2, 2026

సామాజిక న్యాయం సాధనకై ఉద్యమిద్దాం: సత్యారెడ్డి

image

సామాజిక న్యాయం అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు సత్యారెడ్డి ఆకాంక్షించారు. సిఐటియు జాతీయ మహాసభ సందర్భంగా జరుగుతున్న శ్రామిక ఉత్సవ్ 6వ రోజు సామాజిక న్యాయం సాధనకై ఉద్యమిద్దాం థీమ్‌తో నిర్వహించిన సభా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ యత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకునితీరాలని చెప్పారు.

News January 2, 2026

సామాజిక న్యాయం సాధనకై ఉద్యమిద్దాం: సత్యారెడ్డి

image

సామాజిక న్యాయం అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు సత్యారెడ్డి ఆకాంక్షించారు. సిఐటియు జాతీయ మహాసభ సందర్భంగా జరుగుతున్న శ్రామిక ఉత్సవ్ 6వ రోజు సామాజిక న్యాయం సాధనకై ఉద్యమిద్దాం థీమ్‌తో నిర్వహించిన సభా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ యత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకునితీరాలని చెప్పారు.

News January 1, 2026

సంజీవని నిధికి రూ.8.22 లక్షల స్వచ్ఛంద విరాళాలు

image

నూతన సంవత్సరం సందర్భంగా “సంజీవని నిధి – జిల్లా సహాయ నిధి”కి స్వచ్ఛంద విరాళాలు అందించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ చేసిన విజ్ఞప్తికి జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభించింది. వివిధ ప్రభుత్వ శాఖలు,ఉ ద్యోగులు స్వచ్ఛందంగా విరాళాలు అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. అనేక విభాగాలు, అధికారులు, ఉద్యోగులు, సంఘాలు, వ్యక్తుల స్వచ్ఛందంగా మొత్తం మీద రూ.8,22,292 విరాళాలుగా అందినట్లు కలెక్టర్ వెల్లడించారు.