News February 21, 2026
GVMC పరిధిలో సర్వేయర్ల దోపిడీ ఆరోపణలు!

GVMC పరిధిలో సర్వేయర్లపై దోపిడీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ,ప్రైవేట్ భూముల వివరాలు,సర్వే సర్టిఫికెట్లు,విఎల్టీ,ప్లాన్ మంజూరులు వంటి పనుల కోసం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు అదనంగా వసూలు చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు.పనిని బట్టి రూ.లక్షల్లో డిమాండ్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.ఎస్టేట్ విభాగం పర్యవేక్షణ బలహీనంగా ఉండటంతో సామాన్య,మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు.
Similar News
News February 22, 2026
లడ్డూ తప్ప రాష్ట్రంలో ఇంకే సమస్య లేదా: అంబటి

AP: వైసీపీ చీఫ్ జగన్పై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. లడ్డూ తప్ప రాష్ట్రంలో ఇంకే సమస్య లేదా? అని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న CM చంద్రబాబు తిరుమల శ్రీవారి ఆగ్రహానికి గురవ్వక తప్పదని హెచ్చరించారు. లడ్డూ వ్యవహారంపై సీబీఐ కమిటీ ఛార్జ్షీట్ ఫైల్ చేసిందని, అయినా దానిపై వక్రభాష్యాలు ఎందుకని నిలదీశారు. ప్రజలకు వాస్తవమేంటో తెలుసని చెప్పారు.
News February 22, 2026
భీమవరం: రేపు 10గం.ల నుంచి 1 గంట వరకే ఈ కార్యక్రమం

భీమవరం కలెక్టరేట్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ మండల కార్యాలయాల్లో సోమవారం PGRSను యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ నాగరాణి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్, వెబ్సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30ని.ల వరకు అర్జీలను స్వీకరిస్తామన్నారు.
News February 22, 2026
నెల్లూరు: జైల్లో పొక్సో కేసు నిందితుడి మృతి.!

నెల్లూరు సెంట్రల్ జైల్లో పొక్సో కేస్ నిందితుడు మట్టి సుబ్బారావు (58) ఇవాళ(ఆదివారం) తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. విజయవాడ భవానిపురానికి చెందిన సుబ్బారావు పది నెలలుగా ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో శిక్ష అనుభవిస్తూ చనిపోయాడు. మృతదేహానికి ఆర్డీవో, MRO, వెంకటాచలం పోలీసులు సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు.


