News January 24, 2025

GWL: అబాండెడ్ వాహనాలకు ఈనెల 30న వేలం పాట

image

పోలీస్ తనిఖీల్లో పట్టుబడి ఎవరు గుర్తించలేని అబాండెడ్ వాహనాలకు ఈ నెల 30న ఉదయం 10 గంటలకు పీజేపీ క్యాంపులోని సాయుధ దళ పోలీస్ కార్యాలయం ఆవరణలో వేలంపాట నిర్వహిస్తున్నట్లు గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గలవారు రూ.200 ఫీజు చెల్లించి ఆధార్ కార్డుతో వేలంపాటలో పాల్గొనాలని సూచించారు. వేలంపాటకు ఒకరోజు ముందు వాహనాలు చూసుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.

Similar News

News November 24, 2025

ముగిసిన జీ20 సమ్మిట్.. తిరుగు పయనమైన మోదీ

image

సౌతాఫ్రికా వేదికగా జరిగిన జీ20 సమ్మిట్ ముగిసింది. దీంతో ప్రధాని మోదీ భారత్‌కు తిరుగు పయనమయ్యారు. సదస్సు విజయవంతగా ముగిసిందని ఆయన ట్వీట్ చేశారు. వివిధ దేశాధినేతలతో ఫలప్రదమైన చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు. సమ్మిట్ చివరిరోజు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో మోదీ భేటీ అయ్యారు. ఉగ్రవాదానికి నిధులు అందకుండా అడ్డుకోవడానికి ఇరుదేశాలు ఉమ్మడిగా పోరాడాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

News November 24, 2025

విభూది ఎందుకు ధరించాలి?

image

పరమ శివుడికి విభూది అంటే చాలా ఇష్టం. దీన్నే భస్మం అని కూడా అంటారు. భస్మం మన పాపాలను ప్రక్షాళన చేస్తుందని నమ్ముతారు. హోమంలో భగవంతునికి సమర్పించిన గంధపు చెక్కలు, నెయ్యి, ఇతర ఔషధాల నుంచి భస్మం తయారవుతుంది. దీన్ని ధరిస్తే.. జనన మరణ పరిధుల నుంచి బయటపడతామని, అహంకారం అంతమవుతుందని నమ్ముతారు. అలాగే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని పండితులు చెబుతున్నారు. ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

News November 24, 2025

నేటి నుంచి రాష్ట్రంలో ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమం

image

AP: వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి 29వ తేదీ వరకు ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమాన్ని చేపట్టనుంది. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్ధతు అనే అంశాలతో ప్రభుత్వం పంచ సూత్రాల విధానాన్ని ప్రవేశపెట్టింది. వీటి అమలుతో సాగులో కలిగే మేలుపై రైతుల ఇళ్లకు వెళ్లి ప్రజాప్రతినిధులు, వ్యవసాయ, ఆక్వా, ఉద్యాన అధికారులు వివరించనున్నారు.