News March 12, 2025
GWL: అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉపాధి హామీ, తాగునీరు, ఇందిరమ్మ ఇండ్లు, LRS ప్రక్రియ గురించి సమావేశం నిర్వహించారు. ఉపాధి పనులు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా ఉండకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు.
Similar News
News December 5, 2025
ప.గోలో 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరందించేలా ప్రాజెక్ట్

జిల్లాలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.1,400 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం తెలిపారు. 16 మండలాల పరిధిలోని 862 గ్రామాల్లోని 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. దీని కోసం 2,662 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
News December 5, 2025
టీటీడీ డబ్బుల్లోనూ కమీషన్ల కోసం కక్కుర్తి: వైఎస్ జగన్

TTD డబ్బుల్లో 10 శాతానికి మించి ప్రైవేట్ బ్యాంకుల్లో జమ చేయకూడదని మాజీ సీఎం జగన్ అన్నారు. ‘CBN హయాంలో కమీషన్లకు కక్కుర్తిపడి రూ.1,300 కోట్లు ఎస్ బ్యాంక్లో పెట్టించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ డబ్బును విత్ డ్రా చేసి జాతీయ బ్యాంకులో పెట్టింది. ఆ తర్వాత 3 నెలలకు ఎస్ బ్యాంక్ ఆర్థికంగా కుదేలయ్యింది. ఆ రూ.1,300 కోట్లు ఎస్ బ్యాంక్లోనే ఉంటే ఆ డబ్బు ఏమయ్యేది? మరి ఏది స్కామ్?’ అని ప్రశ్నించారు.
News December 5, 2025
నల్గొండ: ఈ ఎన్నికలు మార్పునకు నాంది కావాలి..!

గ్రామ పంచాయతీ ఎన్నికలు బాధ్యతలతో కూడినవి. అభివృద్ధి పేరుతో అప్పుల్లో కూరుకుపోయిన సర్పంచ్లు అనేకం. ఓటుకు నోటు ఇస్తే నిజాయతీ నాయకులు ఎదగరు. అభ్యర్థులు డబ్బులు, మద్యం పంచే చెడు పద్ధతులను మానుకోవాలి. ఓటర్లు కూడా డబ్బు కోసం ఓటు అమ్ముకుంటే ప్రశ్నించే హక్కు కోల్పోతారు. విలువలున్న వ్యక్తులనే ఎన్నుకుంటేనే గ్రామాల్లో నిజమైన మార్పు సాధ్యం. 2025 ఎన్నికలు మార్పునకు నాంది కావాలి.. ఓ పల్లె ఓటరా ఆలోచించు..!


