News February 21, 2025
GWL: ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి..

మార్చి 5 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ సమావేశం మందిరంలో పరీక్షల నిర్వహణపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 14 పరీక్షా కేంద్రాల్లో 8,341 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉందన్నారు. కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ సౌకర్యం తదితర ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
Similar News
News February 24, 2026
DANGER: HYDలో విష జ్వరాలు!

HYDలో దోమలు చిత్రహింసలు పెడుతున్నాయి. మూసీ పరిసరాల్లో లేకున్నా దోమలు విపరీతంగా వ్యాపించాయి. వేలాది దోమలు గుంపులుగా దండయాత్ర చేస్తున్నాయి. ఉప్పల్, చిల్కానగర్లో విష జ్వరాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. కోరంటి, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో చేరినట్లుగా పలువురు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. చిన్న పిల్లలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దోమల నివారణకు చర్యలు లేవని ఆరోపిస్తున్నారు.
News February 24, 2026
ఉమ్మడి WGL: CC కెమెరాల నిఘాలో ఇంటర్ పరీక్షలు..!

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు రేపట్నుంచి ప్రారంభం కానున్నాయి. ఫస్టియర్ ఎగ్జామ్స్ బుధవారం, సెకండియర్ పరీక్షలు గురువారం నుంచి జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షా సమయం. హాల్ టికెట్లపై ఉన్న QR కోడ్ ద్వారా సెంటర్ వివరాలు తెలుసుకోవచ్చు. ఉమ్మడి WGK వ్యాప్తంగా CC కెమెరాల నిఘాలో 75,277 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. WGL- 12166, HNK- 38600, JN-8605, MHBD-8287, BHPL- 3778, MLG- 3841.
News February 24, 2026
టీచర్ కావాలనుకుంటున్నారా? ఇది మీ కోసమే

నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(NCET-2026) <


