News March 4, 2025
GWL: ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయాలని, ఆ పరిసరాల్లో లౌడ్ స్పీకర్లు వినియోగించరాదని సూచించారు. 500 మీటర్ల వరకు ప్రజలు గుమికూడ రాదన్నారు.
Similar News
News November 27, 2025
విజయవాడ GGHలో వేధిస్తున్న MNO&FNOల కొరత..!

విజయవాడ జీజీహెచ్లో రోగులను వార్డుల్లోకి మార్చే (MNO/FNO) సిబ్బంది తీవ్ర కొరతతో అత్యవసర చికిత్సలకు అంతరాయం కలుగుతోంది. ఆసుపత్రిలో 1657 బెడ్లు ఉండగా, కనీసం 400 మంది సిబ్బంది అవసరం. ప్రస్తుతం 100 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన 4650 మంది సిబ్బంది నియామక ఫైలు ముందుకు కదలకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
News November 27, 2025
తూ.గో.లో మండపేట విలీనం.. పెరగనున్న పట్టణ జనాభా

జిల్లాల పునర్విభజనలో భాగంగా తూ.గో జిల్లా పట్టణ జనాభా పెరగనుంది. మండపేట నియోజకవర్గాన్ని జిల్లాలో పూర్తిగా కలుపుతూ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో మండపేట మున్సిపాలిటీ జిల్లా పరిధిలోకి చేరనుంది. ప్రస్తుతం రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు పట్టణాలతో కలిపి 4,27,380 ఉన్న జిల్లా పట్టణ జనాభా.. మండపేట చేరికతో 4,80,968కి చేరనుంది. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
News November 27, 2025
అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష: ఎస్పీ

మానసిక వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి పోక్సో కోర్టు జడ్జి వై. వెన్నయ్య నాయుడు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ రాహుల్ మీనా బుధవారం తెలిపారు. అంబాజీపేట మండలం చిరుతపూడికి చెందిన కట్టా బ్రహ్మేశ్వరరావు, అదే గ్రామానికి చెందిన 25 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. సత్వర దర్యాప్తుతో నిందితుడికి శిక్ష పడింది.


