News March 4, 2025
GWL: ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయాలని, ఆ పరిసరాల్లో లౌడ్ స్పీకర్లు వినియోగించరాదని సూచించారు. 500 మీటర్ల వరకు ప్రజలు గుమికూడ రాదన్నారు.
Similar News
News November 18, 2025
హైదరాబాద్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా..!

హైదరాబాద్ జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. మారెడ్పల్లి మండలంలో అత్యల్ప ఉష్ణోగ్రత 13.1℃గా నమోదైంది. అటు హిమాయత్నగర్, ముషీరాబాద్, నాంపల్లి, చార్మినార్, బండ్లగూడ, బహదర్పురా, అసిఫ్నగర్ 13.9, గోల్కొండ 14.6, తిరుమలగిరి 15.2, ఖైరతాబాద్ 15.3, షేక్పేట్ 16.1, సికింద్రాబాద్ మండలంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 16.2℃గా నమోదైంది.
News November 18, 2025
హైదరాబాద్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా..!

హైదరాబాద్ జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. మారెడ్పల్లి మండలంలో అత్యల్ప ఉష్ణోగ్రత 13.1℃గా నమోదైంది. అటు హిమాయత్నగర్, ముషీరాబాద్, నాంపల్లి, చార్మినార్, బండ్లగూడ, బహదర్పురా, అసిఫ్నగర్ 13.9, గోల్కొండ 14.6, తిరుమలగిరి 15.2, ఖైరతాబాద్ 15.3, షేక్పేట్ 16.1, సికింద్రాబాద్ మండలంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 16.2℃గా నమోదైంది.
News November 18, 2025
సీనియర్ నేతలను వదులుకొని KCR తప్పు చేశారు: కవిత

సీనియర్ నేతలను వదులుకొని KCR తప్పు చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ MP కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. మంగళవారం ఆమె జాగృతి జనం బాటలో భాగంగా మీడియాతో మాట్లాడారు. 20 ఏళ్లు పనిచేసిన తనను కుట్ర చేసి పార్టీ నుంచి, కుటుంబం నుంచి దూరం చేశారని అన్నారు. తనపై ఇంకా నీచస్థాయిలో దాడులు చేస్తున్నారని, అయినా సరే ఎవ్వరికీ బెదిరేదే లేదని కవిత స్పష్టం చేశారు.


