News April 3, 2025

GWL: ఈత సరదా.. ముగ్గురి ప్రాణం తీసింది!

image

ఈతకెళ్లి మునిగిపోయి ముగ్గురు మృతిచెందిన ఘటన నిన్న రాజోళి మండలంలో జరిగింది. ఏపీలోని కర్నూలు లక్ష్మీనగర్‌కు చెందిన సులేమాన్(47) కుటుంబంతో కలిసి సుంకేసులడ్యామ్‌కు వచ్చారు. కొడుకులు ఫర్హాన్(11), ఫైజాన్(9)లతో కలిసి సరదాగా ఈతకొట్టేందుకు దిగారు. ప్రమాదవశాత్తు కొడుకులిద్దరూ నీటిలో మునిగిపోయారు. గమనించిన తండ్రి కాపాడేందుకు వెళ్లగా, ఆయనా మునిగిపోయారు. పోలీసుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు.

Similar News

News September 15, 2025

కరీంనగర్: 24/7 తాగునీరు రావట్లే..!

image

ప్రజారోగ్య శాఖ అధికారుల అలసత్వంతో కరీంనగర్ పట్టణ ప్రజలకు 24/7 తాగునీరు అందడం లేదు. ఎల్ఎండీలో 23 టీఎంసీల నీరున్నా తాగునీటి సరఫరా ఎందుకు చేయడం లేదని నగరవాసులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మూడు రోజులకు ఒకసారి గంట మాత్రమే మంచినీటి సరఫరా జరుగుతోంది. పట్టణంలో 13వేల నల్లా కనెక్షన్లు ఉండగా 60వేల మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉంటుంది. అమృత్- 2 పథకంలో భాగంగా పట్టణమంతటా పైప్‌లైన్ల నిర్మాణం పూర్తయింది.

News September 15, 2025

విజయవాడలో ఇంటింటికీ మెడికల్ కిట్లు

image

న్యూ RRపేటలో డయేరియా కేసులు పెరగడంతో ప్రభుత్వం అక్కడ ప్రతి ఇంటికీ ఉచితంగా మెడికల్ కిట్లను పంపిణీ చేస్తోంది. ఈ కిట్‌లో రోగ నిరోధక శక్తిని పెంచే జింక్ టాబ్లెట్‌తో పాటు, బ్యాక్టీరియాను నివారించే మూడు రకాల మందులు, ORS ప్యాకెట్లు ఉన్నాయి. 2 లక్షల మెడికల్ కిట్లను పంపిణీ చేసి, వాటిని ఎలా వాడాలో అవగాహన కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు. వీటితో పాటు హైజిన్ కిట్లను కూడా VMC అధికారులు పంపిణీ చేస్తున్నారు.

News September 15, 2025

ములుగు: మేడారం మహా జాతర రోడ్ మ్యాప్ పరిశీలన

image

సమ్మక్క- సారలమ్మ మేడారం మహా జాతరకు సంబంధించిన రోడ్ మ్యాప్లను మంత్రి సీతక్క ఆదివారం పరిశీలించారు. జిల్లా ఎస్పీ శబరీష్‌తో కలిసి ద్విచక్రవాహనంపై జాతర జరిగే ప్రాంతాలను ఆమె కలియతిరిగారు. మహా జాతరకు ఆరు నెలల ముందే రోడ్డు పనులు, కలవర్టు పనులను ప్రారంభించాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.