News April 3, 2025

GWL: ఈత సరదా.. ముగ్గురి ప్రాణం తీసింది!

image

ఈతకెళ్లి మునిగిపోయి ముగ్గురు మృతిచెందిన ఘటన నిన్న రాజోళి మండలంలో జరిగింది. ఏపీలోని కర్నూలు లక్ష్మీనగర్‌కు చెందిన సులేమాన్(47) కుటుంబంతో కలిసి సుంకేసులడ్యామ్‌కు వచ్చారు. కొడుకులు ఫర్హాన్(11), ఫైజాన్(9)లతో కలిసి సరదాగా ఈతకొట్టేందుకు దిగారు. ప్రమాదవశాత్తు కొడుకులిద్దరూ నీటిలో మునిగిపోయారు. గమనించిన తండ్రి కాపాడేందుకు వెళ్లగా, ఆయనా మునిగిపోయారు. పోలీసుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు.

Similar News

News April 11, 2025

రేపే రిజల్ట్.. అనంతపురం జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

image

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. అనంతపురం జిల్లాలో ఫస్టియర్ 25,730 మంది, సెకండియర్ 22,960 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News April 11, 2025

రుషికొండ: రేపటి నుంచి శ్రీవారి లడ్డూ విక్రయాలు నిలిపివేత

image

విశాఖ రుషికొండలో గల శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం శ్రీవారి లడ్డూల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ ఏఈవో జగన్మోహనాచార్య శుక్రవారం తెలిపారు. ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంకు శ్రీవారి లడ్డూల పంపిన నేపథ్యంలో ఇక్కడి విక్రయాలు నిలిపివేశామన్నారు. కావున భక్తులు గమనించాలని కోరారు.

News April 11, 2025

వికారాబాద్: ‘నాణ్యమైన ఉత్పత్తులే విక్రయించాలి’

image

నాణ్యమైన, స్వచ్ఛమైన పాలతో తయారు చేసిన ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్‌లోని ఆవరణలో విజయ తెలంగాణ పాల ఉత్పత్తి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే విజయ డెయిరీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. విజయ విజయ డెయిరీ కేంద్రంలో నాణ్యమైన ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని యాజమాన్యానికి కలెక్టర్ చూసించారు.

error: Content is protected !!