News April 3, 2025

GWL: ఈత సరదా.. ముగ్గురి ప్రాణం తీసింది!

image

ఈతకెళ్లి మునిగిపోయి ముగ్గురు మృతిచెందిన ఘటన నిన్న రాజోళి మండలంలో జరిగింది. ఏపీలోని కర్నూలు లక్ష్మీనగర్‌కు చెందిన సులేమాన్(47) కుటుంబంతో కలిసి సుంకేసులడ్యామ్‌కు వచ్చారు. కొడుకులు ఫర్హాన్(11), ఫైజాన్(9)లతో కలిసి సరదాగా ఈతకొట్టేందుకు దిగారు. ప్రమాదవశాత్తు కొడుకులిద్దరూ నీటిలో మునిగిపోయారు. గమనించిన తండ్రి కాపాడేందుకు వెళ్లగా, ఆయనా మునిగిపోయారు. పోలీసుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు.

Similar News

News December 3, 2025

WNP: డీసీసీ అధ్యక్షుడిగా శివసేనారెడ్డి.. పత్రం అందజేత

image

వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన శివసేనారెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నియామక పత్రాన్ని అందుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా ఆయన ఈ పత్రాన్ని స్వీకరించారు. జిల్లాలో అందరి సహకారంతో పార్టీని మరింత బలోపేతం చేస్తానని శివసేనారెడ్డి పేర్కొన్నారు.

News December 3, 2025

త్వరలో 40వేల ఉద్యోగాల భర్తీ: రేవంత్

image

TG: 2023 DEC 3న పదేళ్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడారని CM రేవంత్ అన్నారు. ‘శ్రీకాంతాచారి బలిదానం కూడా ఇదేరోజు జరిగింది. ఆయన స్ఫూర్తితో 60వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. మరో 40వేల కోసం ప్రణాళికలు రచిస్తున్నాం. రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం’ అని హుస్నాబాద్ సభలో ప్రకటించారు. 2001లో ఈ ప్రాంతం నుంచే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని 2004లో కరీంనగర్‌లో సోనియా ప్రత్యేక రాష్ట్రంపై మాటిచ్చారన్నారు.

News December 3, 2025

తిరుపతి: పట్టని ప్రయోగంతో భవిష్యత్తు ఎటు.!

image

ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మరో 2 నెలల కాలంలో ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 109 ప్రైవేట్ జూనియర్ కళాశాలలో 25వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఇప్పటివరకు ప్రయోగాలు చేపించిన పరిస్థితి లేదు. ఇంటర్ బోర్డు అధికారులు ప్రైవేట్ కళాశాలలు వైపు చూసే పరిస్థితి కూడా లేదు. అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.