News February 1, 2025

GWL: ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమావేశంలో కలెక్టర్

image

గద్వాల జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన జిల్లా ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ సంతోష్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా నుంచి ఎగుమతి ప్రోత్సాహాన్ని పెంపొందించడంతో పాటు జిల్లాను ఎగుమతి హబ్‌గా మార్చేందుకు స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు జిల్లా స్థాయి ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు.

Similar News

News November 16, 2025

WOW.. చీమ కాలుపైనున్న వెంట్రుకలను కూడా గుర్తించే లెన్స్!

image

జార్జియా టెక్ శాస్త్రవేత్తలు విద్యుత్ అవసరం లేకుండా పనిచేసే PHySL అనే విప్లవాత్మక సాఫ్ట్ రోబోటిక్ లెన్స్‌ను సృష్టించారు. చీమ కాలుపై వెంట్రుకలను కూడా గుర్తించగలిగే సామర్థ్యం దీనికుందని చెబుతున్నారు. 4 మైక్రోమీటర్ల వెడల్పున్న అతి చిన్న వస్తువులను సైతం దీంతో స్పష్టంగా చూడొచ్చంటున్నారు. సర్జికల్ రోబోట్‌లు, వైద్యం, వ్యవసాయంతో సహా అనేక రంగాలలో ఈ సాంకేతికత అద్భుతమైన మార్పులు తీసుకొస్తుందని తెలిపారు.

News November 16, 2025

పొద్దుతిరుగుడు విత్తనాలను ఇలా నాటితే మేలు

image

పొద్దుతిరుగుడు సాగు చేసే రైతులు బోదెలు చేసి విత్తనం నాటినట్లైతే నీటితడులు ఇవ్వడానికి, ఎరువులను వేయుటకు అనుకూలంగా ఉండటమే కాకుండా మొక్కకు పటుత్వం కూడా లభిస్తుంది. నేల స్వభావాన్ని బట్టి విత్తే దూరం నిర్ణయించాలి. తేలిక నేలల్లో వరుసల మధ్య 45 సెం.మీ. మరియు మొక్కల మధ్య 20-25 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి. బరువైన నేలల్లో వరుసల మధ్య 60 సెం.మీ. మరియు మొక్కల మధ్య 30 సెం.మీ. దూరంలో విత్తాలి.

News November 16, 2025

కర్ణాటకలో మిస్సింగ్.. కుప్పంలో డెడ్ బాడీ

image

కర్ణాటక అత్తిబెలే సమీపంలో మిస్సయిన శ్రీనాథ్ డెడ్ బాడీ కుప్పంలో పూడ్చిపెట్టినట్లు కర్ణాటక పోలీసులు గుర్తించారు. కుప్పం ఎన్టీఆర్ కాలనీకి చెందిన శ్రీనాథ్ అత్తిబెలే వద్ద నివాసం ఉంటుండగా గత నెల 27 నుంచి కనబడడం లేదంటూ కుటుంబ సభ్యులు అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామకుప్పం(M) ముద్దునపల్లికి చెందిన ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకోగా మృతదేహాన్ని జగనన్న కాలనీలోని ఓ ఇంట్లో పూడ్చిపెట్టినట్లు గుర్తించారు.