News March 6, 2025

GWL: ఒకవైపు తండ్రి మృతి.. మరోవైపు పరీక్ష

image

అయ్యో.. కాలం ఆ ఇంటర్ విద్యార్థికి ఎంతటి కఠిన పరీక్ష పెట్టిందో..! ఒకవైపు ఇంటర్ పరీక్షలు, మరోవైపు తండ్రి మృతదేహం. నాన్న దూరమయ్యాడన్న దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని పరీక్ష రాసేందుకు ఓ విద్యార్థి వెళ్లిన ఘటన గద్వాల జిల్లా అల్లంపూర్ మండలంలోని లింగన్వాయిలో జరిగింది. గ్రామానికి చెందిన మహబూబ్ బాషా కుమారుడు సమీర్ దేవరకద్రలో గురుకులలో ఇంటర్ పరీక్ష రాసి అంత్యక్రియలో పాల్గొనడం అందరిని కంటతడి పెట్టించింది.

Similar News

News March 25, 2025

భోజనం చేశాక ఇలా అనిపిస్తోందా?

image

కొందరికి భోజనం చేశాక పొట్టలో గడబిడగా ఉంటుంది. వేయించిన ఆహారం తీసుకున్నా, వేగంగా, పూర్తిగా నమలకుండా తీసుకున్నా కడుపులో ఉబ్బరం సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని పట్టించుకోకపోతే ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. తిన్న వెంటనే కాకుండా 10 నిమిషాల తర్వాత వాకింగ్ చేయాలి. తిన్నాక డ్రింక్స్ తాగకూడదు. రాత్రి సమయంలో క్యాలిఫ్లవర్, క్యాబేజీ, ఉల్లి, వెల్లుల్లి, దుంపలు తీసుకోకూడదు.

News March 25, 2025

SLBC సొరంగం నుంచి మరో మృతదేహం వెలికితీత

image

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ఈరోజు ఉదయం గుర్తించిన మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. నాగర్‌కర్నూల్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యూపీకి చెందిన ఇంజినీర్ మనోజ్ కుమార్‌గా గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. మొత్తం 8మంది టన్నెల్‌లో చనిపోగా ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాల్ని వెలికితీశారు. మరో ఆరుగురి మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది.

News March 25, 2025

SKLM: కరెంట్ షాక్‌తో అటెండర్ మృతి

image

శ్రీకాకుళం జడ్పీ కార్యాలయం వెనుక ఉన్న గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) పర్యవేక్షక ఇంజినీరు కార్యాలయం అటెండర్ మల్లారెడ్డి ఆనందరావు (46) మంగళవారం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. కార్యాలయం ఆవరణలో మోటారు వేసేందుకు వెళ్లిన ఆయన షార్ట్ సర్క్యూట్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు.

error: Content is protected !!