News February 25, 2026

GWL: ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలి

image

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగవంతం చేసి పురోగతి సాధించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అన్ని మండలాల తహశీల్దార్లతో స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ చేశారు. భూభారతి దరఖాస్తులు, రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల జారీ తదితర అంశాల పురోగతిపై సమీక్షించారు. ఓటరు జాబితా సవరణలో తప్పిదాలు లేకుండా మ్యాపింగ్ చేయాలని సూచించారు.

Similar News

News April 16, 2026

ఢిల్లీలో ఉమ్మడి విజయనగరం జిల్లా మహిళా ప్రజా ప్రతినిధుల సందడి

image

ఢిల్లీలో ఉమ్మడి విజయనగరం జిల్లా మహిళా ప్రజా ప్రతినిధులు గురువారం సందడి చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి పార్లమెంట్ చర్చల నేపథ్యంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఫొటోలు దిగారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అనిత, మంత్రి సంధ్యారాణి, MLAలు జగదీశ్వరి, నాగమాధవి, ఎమ్మెల్సీ గ్రీష్మ, తదితరులు పాల్గొన్నారు.

News April 16, 2026

GNT: కోర్టులో దురుసు ప్రవర్తన.. యువతికి ఫైన్

image

గుంటూరు హత్య కేసు ట్రయల్‌లో సాక్షిగా హాజరైన పావని కోర్టులో స్టేట్‌మెంట్ ఇవ్వకుండా బిగ్గరగా కేకలు వేస్తూ జడ్జి, పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూచనలను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కోర్టు ప్రొసీడింగ్స్‌కు అంతరాయం కలిగించడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి రూ. 200 ఫైన్ విధించారు. చెల్లించకపోతే 15 రోజుల సాధారణ శిక్ష అనుభవించాలని ఆదేశించారు.

News April 16, 2026

మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు: నెల్లూరు జేసీ

image

నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగుతోందని, రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే అమ్ముకోవాలని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు సూచించారు. ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని, సమస్యలు ఉంటే 1967, 85208 79979 నంబర్లను సంప్రదించాలని కోరారు. విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.