News January 28, 2025

GWL: కాలేజీకి వెళ్లమంటే.. ఆత్మహత్య చేసుకుంది

image

గద్వాల(M) అనంతపురానికి చెందిన ఓ యువతిని తల్లి కళాశాలకు వెళ్లమని మందలించినందుకు మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పావని (16) ఇంటర్ చదువుతోంది. సోమవారం యువతిని తల్లి మందలించి కూలికి వెళ్లింది. దీంతో పావని ఇంట్లో ఉరేసుకుంది. పనుల నుంచి ఇంటికొచ్చిన తల్లి యువతిని చూసి గుండెలవిసేలా విలపించింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News February 15, 2025

సామర్లకోట: రైలు ఎక్కుతూ యువకుడు మృతి

image

యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ నాయకర్ కాలనీకి చెందిన వాకాడ జాన్ బాబు (27) శనివారం ఉదయం సామర్లకోట రైల్వే స్టేషన్‌లో నూజివీడు వెళ్లేందుకు తన తండ్రి, భార్య, కుమారుడితో కలిసి ట్రైన్ ఎక్కుతుండగా జారి పడిపోయాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో అతని తండ్రి, భార్య నిశ్చేష్టులయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి డెడ్‌బాడీని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News February 15, 2025

గిరిజనుల్లో పేదరికాన్ని రూపుమాపుతాం: సీఎం

image

సమగ్ర ప్రణాళికతో గిరిజనుల్లో పేదరికాన్ని నిర్మూలిస్తామని, గిరిజన చట్టాలను కాపాడతామని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా ఉండవల్లిలోని నివాసంలో సేవాలాల్‌కు నివాళులర్పించారు. సీఎం మాట్లాడుతూ.. గిరిజనులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఎన్టీఆర్ అనేక సంక్షేమాలు అమలు చేశారన్నారు. ఆయన స్పూర్తితో గిరిజనులకు రాజకీయ అవకాశాలు కల్పించి అండగా నిలిచామన్నారు.

News February 15, 2025

KMR: లైంగిక దాడులను అరికట్టాలి: అదనపు కలెక్టర్

image

పాఠశాలలలో పిల్లలపై జరిగే లైంగిక దాడులను అరికట్టే దిశగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ సూచించారు. కలెక్టరేట్‌లో ఫోక్సో చట్టంపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ హాజరై.. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్‌కి బ్యాడ్జీలు ప్రధానం చేశారు. జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!