News March 12, 2025
GWL: గద్వాల అభివృద్ధికి నిధుల కేటాయింపు జరిగేనా?

గద్వాల జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అసెంబ్లీ సమావేశాల్లో నిధులు కేటాయించాలని నడిగడ్డ ప్రజలు అంటున్నారు. ప్రధానంగా RDS చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు తుమ్మిళ్ల లిఫ్ట్ పరిధిలో 3 రిజర్వాయర్లు నిర్మించాలని, నెట్టెంపాడు ప్రాజెక్టులో మిగిలిన పనులు, గట్టు ఎత్తిపోతల పూర్తిచేయాలని, కర్నూల్ రాయచూరు రోడ్డు కు నిధులు కేటాయించాలని, అయిజను సెగ్మెంట్ గా గుర్తించాలని కోరుతున్నారు.
Similar News
News December 9, 2025
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి.. మంత్రి విచారం వ్యక్తం

నగరి(M) తడుకుపేట సమీపంలో రెండు కార్లు ఢీకొని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ పోటు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి మండిపల్లి స్పందించారు. ఘటన బాధాకరమని, సంతాపం వ్యక్తం చేశారు. రోడ్డు భద్రతపై ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
News December 9, 2025
పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్?

వ్యాపారవేత్త రాజ్హిత్ ఇబ్రాన్తో హీరోయిన్ నివేదా పేతురాజ్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరి వివాహం రద్దయినట్లు ప్రచారం జరుగుతోంది. తన ఇన్స్టా అకౌంట్ నుంచి ఎంగేజ్మెంట్ పోస్ట్ను తొలగించడం, ఇద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఇటీవలే క్రికెటర్ స్మృతి మంధాన వివాహం కూడా ఎంగేజ్మెంట్ తర్వాత రద్దయింది.
News December 9, 2025
వాజ్పేయి పాలసీలతో అభివృద్ధికి పునాది: CM

AP: ఈనెల 11-25 మధ్య జరిగే ‘అటల్ సందేశ్.. మోదీ సుపరిపాలన యాత్ర’లో కూటమి నేతలంతా పాల్గొనాలని CM CBN సూచించారు. వాజ్పేయి సుపరిపాలనకు నాంది పలికారని, ఆయన పాలసీలతోనే దేశాభివృద్ధికి పునాది పడిందని చెప్పారు. రోడ్లు, విమానయాన, టెలీ కమ్యూనికేషన్ రంగాల్లో సంస్కరణలు తెచ్చారన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి వెంటనే స్పందించేవారన్నారు. PM మోదీ దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు.


