News December 20, 2024
GWL: గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి: జిల్లా ఎస్పీ
గట్టు మండల పోలీస్ స్టేషన్ను గద్వాల జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్లో రికార్డులు, కేసులు, పెండింగ్ కేసులు, సీడీ ఫైళ్లు తదితరాలను సమీక్షించారు. గ్రామ ప్రజల ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు, స్టేషన్లో ఉన్న కార్యకలాపాలపై పోలీస్ సిబ్బందితో చర్చించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, వారికి మెరుగైన సేవలు అందించాలని పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు.
Similar News
News January 25, 2025
MBNR: రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యం : ఎమ్మెల్యే
రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా క్రీడా మైదానంలో రూ.13 లక్షలతో నిర్మించిన డ్రెస్సింగ్ (కబడ్డీ క్రీడాకారిణిలకు) రూమ్, క్రీడా సామగ్రి స్టోర్ రూమును ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను వెలికితీసి జాతీయ స్థాయిలో జిల్లా క్రీడాకారులను పరిచయం చేయాలని అన్నారు.
News January 24, 2025
MBNR: తెలంగాణ విధ్వంసానికి కారణం కల్వకుంట్ల కుటుంబమే: ఎమ్మెల్యే
కల్వకుంట్ల కుటుంబంలోని ఆ నలుగురే తెలంగాణ విధ్వంసానికి కారణమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ధ్వజంఎత్తారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో చేస్తున్న అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి అర్థం అవుతుందని ధీమా వ్యక్తంచేశారు.
News January 24, 2025
MBNR: రాష్ట్రంలోనే నంబర్ 1 కాలేజీగా అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ లోని జేపీ ఐటీఐ కళాశాల భవననిర్మాణానికి రూ.కోటి మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. కళాశాలను ఎమ్మెల్యే సందర్శంచి, కళాశాలలోని పరిసరాలను పరిశీలించారు. అవసరమైన మౌలిక సదుపాయాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కళాశాలకు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలోనే నంబర్ వన్ కాలేజీగా అభివృద్ధి చేస్తానన్నారు.