News February 4, 2025

GWL: నేటి నుంచి జమ్ములమ్మ బ్రహ్మోత్సవాలు

image

నడిగడ్డ ప్రజల ఆరాధ్య దైవం జమ్మిచేడు జమ్ములమ్మ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 12 వరకు జరగనున్నాయి. జమ్ములమ్మ మెట్టినిల్లు అయిన గుర్రం గడ్డ దీవి నుంచి ఎద్దుల బండి పై బుధవారం అమ్మవారి విగ్రహాన్ని జమ్మిచేడు ఆలయానికి తీసుకువస్తారు. పది రోజులపాటు జరిగే ఉత్సవాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకోనున్నారు.

Similar News

News November 18, 2025

ఇన్‌ఛార్జ్ HM, పీడీలకు షోకాజ్ నోటీసులు: DEO

image

పిడుగురాళ్ల మండలం కరాలపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మట్టి పనులు చేయించినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై డీఈవో చంద్రకళ స్పందించారు. పాఠశాల ఇన్‌ఛార్జ్ హెచ్ఎం రాజు నాయక్, ఫిజికల్ డైరెక్టర్ అశోక్ కుమారిలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై కమిటీ వేసి, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News November 18, 2025

ఇన్‌ఛార్జ్ HM, పీడీలకు షోకాజ్ నోటీసులు: DEO

image

పిడుగురాళ్ల మండలం కరాలపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మట్టి పనులు చేయించినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై డీఈవో చంద్రకళ స్పందించారు. పాఠశాల ఇన్‌ఛార్జ్ హెచ్ఎం రాజు నాయక్, ఫిజికల్ డైరెక్టర్ అశోక్ కుమారిలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై కమిటీ వేసి, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News November 18, 2025

మతిస్థిమితం లేని వ్యక్తుల వివరాలు అందించండి: VZM SP

image

జిల్లాలో రహదారులపై మతిస్థిమితం లేని నిరాశ్రయులకు సహాయం అందించేందుకు ‘ఓ ఫౌండేషన్’ ముందుకు రావడం అభినందనీయమని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఫౌండేషన్ వాల్ పోస్టర్‌ను ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలను www.manobhandhu.org వెబ్‌సైట్‌కి పంపించాలని ఆయన కోరారు. రెడ్ క్రాస్ సహకారంతో బాధితులను హోమ్‌లకు తరలించి చికిత్స అందించనున్నట్లు చెప్పారు.