News February 4, 2025
GWL: నేటి నుంచి జమ్ములమ్మ బ్రహ్మోత్సవాలు

నడిగడ్డ ప్రజల ఆరాధ్య దైవం జమ్మిచేడు జమ్ములమ్మ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 12 వరకు జరగనున్నాయి. జమ్ములమ్మ మెట్టినిల్లు అయిన గుర్రం గడ్డ దీవి నుంచి ఎద్దుల బండి పై బుధవారం అమ్మవారి విగ్రహాన్ని జమ్మిచేడు ఆలయానికి తీసుకువస్తారు. పది రోజులపాటు జరిగే ఉత్సవాల్లో వివిధ రాష్ట్రాల భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకోనున్నారు. మరి ఈ బ్రహ్మోత్సవాలకు మీరెళ్తున్నారా.?
Similar News
News February 12, 2025
మంథని: సొమసిల్లి పడిపోయిన వృద్ధురాలు మృతి

మంథని పట్టణం అంబేడ్కర్ చౌరస్తాలో చీర్ల శంకరమ్మ (65) వృద్ధురాలు కూరగాయలు అమ్ముకుంటూ అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయింది. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించి వృద్ధురాలు మరణించినట్లు వెల్లడించారు. వృద్ధురాలిది భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కొంత కాలంగా మంథనిలో కూరగాయలు అమ్ముతూ జీవనం కొనసాగిస్తుందని స్థానికులు చెబుతున్నారు.
News February 12, 2025
సంగారెడ్డి: ముగిసిన క్రీడా పోటీలు

నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని అంబేద్కర్ మైదానంలో రెండు రోజులపాటు నిర్వహించిన క్రీడా పోటీలు మంగళవారం ముగిస్తాయి. కబడ్డి, వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు నెహ్రూ యువ కేంద్రం రాష్ట్ర మాజీ డైరెక్టర్ వెంకటేశం, జిల్లా క్రీడ అభివృద్ధి అధికారి కాసిం బేక్ విజేతలకు బహుమతులు అందించారు.
News February 12, 2025
పబ్లిక్లో పొట్టి దుస్తులు ధరించడం నేరం కాదు: ఢిల్లీ కోర్టు

బార్లో అశ్లీల నృత్యం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు మహిళలను ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. బహిరంగంగా పొట్టి దుస్తులు ధరించడం నేరం కాదంది. వారి డాన్స్ ప్రజలకు చిరాకు కలిగిస్తేనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. పొట్టి దుస్తులు ధరించి అశ్లీల డాన్స్ చేశారంటూ గత ఏడాది పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీనివల్ల ఇబ్బందిపడిన సాక్షులను ప్రవేశపెట్టడంలో విఫలమయ్యారని కోర్టు పేర్కొంది.