News February 23, 2025
GWL: పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్

ఉమ్మడి ఇటికాల మండలంలోని గురుకుల పాఠశాలల్లో ఆదివారం జరిగిన 2025 పీజీ సెట్ గురుకుల ప్రవేశ పరీక్ష కేంద్రాలను ఆదివారం గద్వాల అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు పరిశీలించారు. పరీక్ష నిర్వహణ తీరు, కేంద్రాల వద్ద సౌకర్యాలను పరిశీలించారు. పరీక్షలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించాలని సూచించారు. ప్రిన్సిపల్ రామాంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News November 19, 2025
కావలి: ప్రేమపేరుతో మోసం.. యువతి ఆత్మహత్యాయత్నం

ప్రేమపేరుతో యువకుడు మోసం చేయడంతో యువతి ఆత్మహత్యాయత్ననికి పాల్పడిన ఘటన కావలిలో చోటుచేసుకుంది. విష్ణాలయం వీధికి చెందిన యువకుడు ఓ యువతిని ఐదు నెలలుగా ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకోమంటే కులం పేరుతో దూషించి నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి చెందిన యువతి ఫినాయిల్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 19, 2025
సేవలు – ధరలు – ఇతర వివరాలు

☞ సుప్రభాత సేవ: ఉ.3 గంటలకు ఉంటుంది. రోజుకు 250-300 టికెట్లు ఉంటాయి. ధర ₹120.
☞ తోమాల సేవ: సుప్రభాత సేవ తర్వాత ఉ.3.30కి ఉంటుంది. మంగళ, బుధ, గురు వారాల్లో 10 చొప్పున టికెట్లు మాత్రమే ఉంటాయి. ధర ఒక్కొక్కరికి ₹220.
☞ అర్చన సేవ: ఇది కూడా మంగళ, బుధ, గురు వారాల్లో 10 టికెట్లు మాత్రమే ఉంటాయి. టికెట్ ప్రైజ్ ₹220.
☞ అష్టదళ పాద పద్మారాధన: మంగళవారం మాత్రమే ఉండే ఈ సేవకు 60 టికెట్లు ఉంటాయి. ధర ₹1,250.
News November 19, 2025
అందుకే ఫైరింగ్ జరగలేదు!

AP: విజయవాడ, ఏలూరులో <<18319919>>మావోయిస్టులను<<>> పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మావోలు, పోలీసులు ఎదురుపడితే పరస్పర కాల్పులు జరుగుతుంటాయి. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో నిన్న అలా జరగలేదు. కొందరు సానుభూతిపరులను పంపి భవనాన్ని చుట్టుముట్టామని తెలియజేశారు. లొంగిపోవాలని సందేశం పంపారు. మావోలు దాచిన ఆయుధాలు బయటికి తీయకుండా దిగ్బంధించారని, దీంతో ప్రతిఘటించలేకపోయారని సమాచారం.


