News February 23, 2025
GWL: పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్

ఉమ్మడి ఇటికాల మండలంలోని గురుకుల పాఠశాలల్లో ఆదివారం జరిగిన 2025 పీజీ సెట్ గురుకుల ప్రవేశ పరీక్ష కేంద్రాలను ఆదివారం గద్వాల అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు పరిశీలించారు. పరీక్ష నిర్వహణ తీరు, కేంద్రాల వద్ద సౌకర్యాలను పరిశీలించారు. పరీక్షలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించాలని సూచించారు. ప్రిన్సిపల్ రామాంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News January 3, 2026
GNT: సీఎం రాక.. ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

సీఎం చంద్రబాబు ఈ నెల 5న గుంటూరు రానున్న నేపథ్యంలో SP వకుల్ జిందాల్తో కలిసి కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం ఏర్పాట్లు పరిశీలించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల చివరి రోజు సీఎం విచ్చేయనున్నారు. శ్రీ సత్యసాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్లో పర్యటన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News January 3, 2026
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు: పొంగులేటి

TG: ఇది పేదల ప్రభుత్వమని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ‘మరో మూడేళ్లు ప్రతి ఏప్రిల్లో విడతల వారీగా అర్హులకు ఇళ్లు ఇస్తాం. గత ప్రభుత్వం పింక్ కలర్ షర్ట్ ఉంటేనే ఇళ్లు ఇచ్చింది. ఆగిపోయిన ఇళ్లకూ నిధులు కేటాయించాం. గత ప్రభుత్వం కమీషన్ల కోణంలోనే పంపిణీ చేసింది. మొదటి విడతలోనే చెంచులకు ఇళ్లిచ్చాం’ అని తెలిపారు.
News January 3, 2026
KNR: ఢిల్లీలో మోగనున్న తెలంగాణ ‘ఒగ్గు డోలు’

తెలంగాణ మట్టి పరిమళం, పల్లె పదాల గలగలలు మరోసారి దేశ రాజధానిలో ప్రతిధ్వనించనున్నాయి. 2026, JAN 26న ఢిల్లీలోని కర్తవ్యపథ్లో జరగనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శన ఇచ్చేందుకు జనగామ(D) మాణిక్యాపురం ‘ఒగ్గు డోలు’ బృందం ఎంపికైంది. దివంగత ప్రముఖ కళాకారుడు మిద్దె రాములు వంటి మహనీయులు విశ్వవ్యాప్తం చేసిన ఈ జానపద కళకు జాతీయ వేదికపై గుర్తింపు లభించడం పట్ల KNRజిల్లా ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.


