News February 16, 2025
GWL: పాముకాటుతో వ్యక్తి మృతి

పాముకాటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన గద్వాల మండలం బీరోలు గ్రామంలో జరిగింది. ఎస్ఐ శ్రీకాంత్ వివరాలు.. గ్రామానికి చెందిన బీచుపల్లి(47) నిన్న కృష్ణనదిలో చేపల వేటకు వెళ్లాడు. మార్గం మధ్యలో పాము కాటు వేసింది. గమనించిన కుటుంబీకులు చికిత్స కోసం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కుమారుడు నరేందర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News February 23, 2026
గుంటూరు SP PGRSకు 215 ఫిర్యాదులు

గుంటూరులోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSకు 215 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కుటుంబ వివాదాలు, ఆస్తి, భూ తగాదాలు, రుణ, ఆర్థిక సమస్యలు, మోసపూరిత కేసులు, వ్యక్తిగత, సామాజిక సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా వచ్చాయన్నారు. ఫిర్యాదులను సమగ్రంగా విచారించి చట్టపరంగా గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
News February 23, 2026
మెట్రో ఇక సర్కారు సొంతం.. ఎల్&టీతో ‘సెటిల్మెంట్’

TG: హైదరాబాద్ మెట్రో రైలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రోను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఎల్&టీకి ఉన్న రూ.13,000 కోట్ల అప్పును ప్రభుత్వమే భరిస్తుందని సమాచారం. అలాగే ఆ సంస్థకు ఈక్విటీ కింద రూ.2,000 కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. మార్చి 31 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసి, రెండో దశ విస్తరణకు కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు చర్యలు చేపట్టనుంది.
News February 23, 2026
జగిత్యాల జిల్లాలో ముందస్తు చర్యలు: ఎస్.ఈ

జగిత్యాల జిల్లా విద్యుత్ వినియోగదారులకు వేసవిలో మెరుగైన, నాణ్యమైన, నిరంతర సరఫరా అందించేందుకు అన్ని స్థాయిల్లో ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఎస్.ఈ. బి.సుదర్శనం తెలిపారు. 45 ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్మర్లు,96 కొత్త ట్రాన్స్ఫార్మర్లు, 9 పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామన్నారు. 2 కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టి, అవసరమైన చోట17 కొత్త బ్రేకర్లు అమర్చామన్నారు. ఇంటర్లింక్ లైన్ మెరుగుపర్చామన్నారు.


