News February 6, 2025
GWL: పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేయాలి.!

గ్రామీణ ప్రాంతాల పిల్లల భద్రత, పోషణ, ఆరోగ్యం, విద్యా భివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. పోషణ, సాధికారిక ఆరోగ్య శిక్షణ కార్యక్రమం ఐడిఓసి సమావేశ మందిరంలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ మహిళలను బలోపేతం చేయడం ద్వారా పిల్లల సమస్యలు సమర్థవంతంగా పరిష్కరించవచ్చన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలన్నారు.
Similar News
News December 8, 2025
ఉడిత్యాలలో..11.4 డిగ్రీల అత్యంత ఉష్ణోగ్రత

మహబూబ్ నగర్ జిల్లాలో గడచిన 24 గంటల్లో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. బాలానగర్ మండలంలోని ఉడిత్యాలలో 11.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. రాజాపూర్ 11.7, గండీడ్ మండలం సల్కర్ పేట 11.8, మిడ్జిల్ మండలం, దోనూరు 12.2, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 12.6, భూత్పూర్ 13.0, మిడ్జిల్ మండలం కొత్తపల్లి 13.3, మహమ్మదాబాద్, కోయిలకొండ మండలం పారుపల్లి 13.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
News December 8, 2025
ఆత్మకూరు: బైకు అదుపు తప్పి యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. ఆత్మకూరుకు చెందిన నవీన్ (36) బంధువుల వద్దకు అమరచింత బంధువుల వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు సమీపంలో బైక్ అదుపుతప్పి ఎడమవైపు ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వచ్చి మరణాన్ని నిర్ధారించారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.
News December 8, 2025
NGKL: జిల్లాలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

నాగర్ కర్నూల్ జిల్లాలో నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. దీంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గడచిన 24 గంటలో అత్యల్పంగా అమ్రాబాద్ మండల కేంద్రంలో 12.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బల్మూర్ మండలం కొండారెడ్డిపల్లిలో 12.2, కల్వకుర్తి మండలం తోటపల్లిలో 13.1, తెలకపల్లి 13.2, బిజినపల్లి, అచ్చంపేట మండలంలో 13.4, తాడూరు మండలం యంగంపల్లి 13.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.


