News January 27, 2025
GWL: పోలీస్ ప్రజావాణిలో 7 ఫిర్యాదులు: SP

గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 7 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. భూ వివాదాలకు సంబంధించి 4, ప్లాటు ఆక్రమణకు సంబంధించి 1, ఇతర అంశాలకు సంబంధించి 2 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత ఎస్సైలకు సూచించారు. ప్రజావాణి ద్వారా బాధితులకు న్యాయం చేసేందుకు జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందని చెప్పారు.
Similar News
News December 7, 2025
జాక్ పాట్ కొట్టిన సిక్కోలు కుర్రాడు.. రూ.92 లక్షలతో ఉద్యోగం

శ్రీకాకుళం పట్టణం బలగ సమీపంలోని శిరిడిసాయి నగర్కు చెందిన విద్యార్థి మెండ హిమవంశి రూ.92 లక్షల వార్షిక వేతనంలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ అబ్బాయి ముంబయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చివరి ఏడాది చదువుతున్నాడు. ఢిల్లీకి చెందిన గ్రావిటన్ రీసెర్చ్ క్యాపిటల్ ఎల్.ఎల్.బి సంస్థ ఇటీవల నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్కు ఎంపికయ్యాడు. పేరెంట్స్, టీచర్లు, కాలనీవాసులు కుర్రాడిని అభినందించారు.
News December 7, 2025
రోహిత్ శర్మ మరో 984 పరుగులు చేస్తే..

ఇంటర్నేషనల్ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లలో రోహిత్ శర్మ(20,048) 13వ స్థానంలో ఉన్నారు. Top10లో నిలవాలంటే ఇంకా 984 రన్స్ చేయాలి. ప్రస్తుతం పదో స్థానంలో జయసూర్య(21,032) కొనసాగుతున్నారు. 11, 12 స్థానాల్లో ఉన్న చందర్పాల్, ఇంజమామ్ రిటైరయ్యారు. ఈ నేపథ్యంలో టాప్ 10లోకి ఎంటరయ్యే ఛాన్స్ రోహిత్కు ఉంది. 2027 ODI WC వరకు ఆడితే ఇది సాధ్యమేనని క్రికెట్ విశ్లేషకుల అంచనా.
News December 7, 2025
భీమవరం: రేపు యథావిధిగా PGRS- కలెక్టర్

భీమవరం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, మండల స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ప్రజలనుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యాలయానికి రాలేనివారు 1100 కాల్ సెంటర్ ద్వారా లేదా meekosam.ap.gov.in వెబ్సైట్లో తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


