News January 27, 2025

GWL: పోలీస్ ప్రజావాణిలో 7 ఫిర్యాదులు: SP

image

గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 7 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. భూ వివాదాలకు సంబంధించి 4, ప్లాటు ఆక్రమణకు సంబంధించి 1, ఇతర అంశాలకు సంబంధించి 2 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత ఎస్సైలకు సూచించారు. ప్రజావాణి ద్వారా బాధితులకు న్యాయం చేసేందుకు జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందని చెప్పారు.

Similar News

News December 5, 2025

సూర్యాపేట: ‘పోస్టల్ బ్యాలెట్ల నిర్వహణకు పకట్బందీ ఏర్పాట్లు చేయాలి’

image

పోస్టల్ బ్యాలెట్ నిర్వహణకు ఫెసిలిటేషన్ సెంటర్లలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవి నాయక్ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి జిల్లాలకు కేటాయించిన ఎన్నికల పరిశీలకులు, జిల్లాల కలెక్టర్లు, పంచాయితీరాజ్, పోలీస్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News December 5, 2025

గన్నవరం చేరుకున్న కన్నడ సూపర్‌ స్టార్

image

కన్నడ సూపర్‌స్టార్ డాక్టర్ శివరాజ్‌ కుమార్‌ శుక్రవారం బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. బొండా సిద్ధార్థ, గుమ్మడి నరసయ్య, డైరెక్టర్ పరమేశ్వర్ తదితరులు, అభిమాన సంఘాల నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి శివరాజ్‌ కుమార్‌ ఇంద్రకీలాద్రికి చేరుకొని కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొంటారు.

News December 5, 2025

వరంగల్ మార్కెట్లో పెరిగిన పత్తి ధర

image

వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గత నాలుగు రోజులతో పోలిస్తే నేడు పత్తి ధర పెరిగింది. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం క్వింటా పత్తి ధర రూ.7,100 పలికింది. ఈ క్రమంలో నేడు రూ.50 పెరిగి రూ.7,150 అయినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. దీంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో కొనుగోళ్లు-అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి.