News April 12, 2025
GWL: పోషకాహార లోపనివారణకు కలెక్టర్ ఆదేశాలు

గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపం నివారణకు పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లాస్థాయి కన్వర్జెన్సీ సమావేశం జరిగింది. ఏప్రిల్ 8 నుంచి 22 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గర్భధారణ ప్రారంభం నుంచి శిశువు పుట్టినరోజు వరకు 1000 రోజుల కాలంలో పోషకాహారంపై దృష్టి సారించాలని అన్నారు.
Similar News
News November 4, 2025
SRD: ప్రేమ పెళ్లి.. అబ్బాయి ఇంటికి నిప్పు

SRD జిల్లా ఝరాసంగం మం.లో ప్రేమ పెళ్లి చేసుకున్నారని యువతి కుటుంబీకులు దారుణానికి ఒడిగట్టారు. కొద్దీ రోజుల క్రితం విఠల్ కూతురు అదే గ్రామ వాసి రాధాకృష్ణను పెళ్లి చేసుకుంది. అదిఇష్టం లేని యువతి తండ్రి, కొడుకుతో కలిసి యువకుడిని, అతడి తండ్రిపై దాడి చేసి ఇంటికి నిప్పుపెట్టారు. స్థానికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. యువకుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News November 4, 2025
అల్లూరి జిల్లాలో భూకంపం

అల్లూరి సీతారామరాజు జిల్లాలో భూకంపం నమోదైనట్లు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ తన వెబ్సైట్లో మంగళవారం పొందుపరిచింది. మంగళవారం తెల్లవారుజామున 4.19 గంటలకు 3.7 పాయింట్ల తీవ్రతతో భూమి కంపించిందని వెల్లడించింది. జి.మాడుగుల పరిసరాల్లో భూమి కంపించినట్లు కొందరు చెబుతున్నారు.
News November 4, 2025
వనస్థలిపురంలో పోస్ట్ ఆఫీస్ సేవలు 24/7

పోస్ట్ ఆఫీస్లలో 24/7 సేవలు అందుబాటులోకి తెచ్చామని ఇండియన్ పోస్ట్ హైదరాబాద్ ఆగ్నేయ మండల సీనియర్ సూపరింటెండెంట్ G.హైమవతి తెలిపారు. స్పీడ్ పోస్ట్, పార్సిల్ సర్వీస్, మనీ ఆర్డర్ సేవలను ప్రజలు అందుబాటులో ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. వనస్థలిపురం(24/7), చార్మినార్ (9PM), ఉప్పల్ (6PM), హైకోర్టు (5 PM), శంషాబాద్ 4.30PM వరకు సేవలను వినియోగించుకోవచ్చు అని G.హైమవతి తెలిపారు.
SHARE IT


