News February 19, 2025

GWL: పౌరుల ప్రాథమిక అవసరాలు తీర్చాలి: కలెక్టర్

image

పౌరుల ప్రాథమిక అవసరాలు తీర్చడమే లక్ష్యంగా మున్సిపల్ సిబ్బంది పని చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పట్టణంలోని 37 వార్డుల్లో రెవెన్యూ, పారిశుద్ధ్యం, మెప్మా, అకౌంట్స్, ఇంజనీరింగ్ వంటి విభాగాల వారిగా సమీక్ష నిర్వహించి, ప్రతి అంశంపై సమగ్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ ఆదాయాన్ని పెంచేందుకు ఆస్తి, దుకాణాల పన్నులు వసూలు చేయాలన్నారు.

Similar News

News November 23, 2025

ఈనెల 24న జిల్లాలో ఏఐసీసీ సెక్రటరీ పర్యటన

image

ఈనెల 24న ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏఐసీసీ సెక్రటరీ పీ.విశ్వనాథన్ పర్యటించనున్నారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా చేపడుతున్న సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను ఈ నెల 24న హనుమకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో విశ్వనాథన్ పర్యటించనున్నారు. ఏఐసీసీ సెక్రటరీ పర్యటన నేపథ్యంలో ఆయా జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

News November 22, 2025

MDK: రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు ప్రాధాన్యత: ఎంపీ

image

రోడ్లు-రైలు మార్గ ప్రాంతాల్లో జరిగే ప్రమాదాలను నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌లు, అండర్ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. శనివారం మెదక్ కలెక్టర్ కార్యాలయంలో రైల్వే, ఫారెస్ట్ ఆర్అండ్‌బీ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రజలకు సురక్షితమైన రవాణా వాతావరణాన్ని కల్పించాలన్నారు.

News November 22, 2025

మంత్రి ఆనం రేపటి పర్యటనా వివరాలు

image

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం జిల్లా పరిధిలో పలు దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు, శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు శ్రీపెనుశిల లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకుంటారు. అనంతరం శ్రీ ఆదిలక్ష్మీ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం, దేవాలయ ప్రాంగణంలో అనివేటి మండపం నిర్మాణానికి వెంకటగిరి MLAతో కలిసి పాల్గొననున్నారు.