News March 14, 2025

GWL: ‘ప్రతి ఒక పౌరుడికి ఓటు హక్కు కల్పించాలి’

image

హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణ జిల్లాలో ప్రతి 3 నెలలకు ఒకసారి పకడ్బందీగా అప్ డేట్ కావాలని, నూతనంగా 18 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రతి ఒక పౌరుడికి ఓటు హక్కు కల్పించాలని అన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో గద్వాల జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొన్నారు.

Similar News

News January 11, 2026

మేడారం: టూర్లతో పనులకు బ్రేకులు!

image

అసలే మేడారం జాతరకు టైమ్ లేదు. మరోపక్క ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఇప్పటికే 7 సార్లు వచ్చిన మంత్రి పొంగులేటి, ఆదివారం మరోసారి వస్తున్నారు. ఆయనతో పాటుగా నలుగురు మంత్రులు వస్తుండటంతో జాతర పనులకు ఆటంకం ఏర్పడుతుందని కార్మికులు వాపోతున్నారు. అసలే సమయం లేకపోగా, మంత్రుల వరుస పర్యటనతో 3 నుంచి 4 గంటల పాటు పనులు నిలిచిపోతున్నాయి. మరోపక్క భక్తులు సైతం పోటెత్తుండటంతో ఈ పనులు కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు.

News January 11, 2026

కమనీయం.. కొత్తకొండ వీరభద్రుడి కల్యాణం

image

కొత్తకొండ వీరభద్ర స్వామి కల్యాణం శనివారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఈ కల్యాణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణం అనంతరం భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఉత్సవమూర్తులను పల్లకీలో కల్యాణ మండపానికి తీసుకువచ్చి వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

News January 11, 2026

మరో యాదాద్రిగా కీసరగుట్ట? మోక్షం ఎన్నడు!

image

HYD శివారు కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మరో యాదాద్రి దేవాలయంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.202 కోట్లను కేటాయించింది. నాటి నుంచి కోట్లాది మంది భక్తులు రాష్ట్రంలో మరో యాదాద్రి స్థాయిలో కీసరగుట్టను చూడాలనే ఆశతో వేచి చూస్తున్నారు. కానీ.. ఇప్పటి వరకు ప్రాజెక్టు ముందుకు పడకపోవడం, దేవాలయం వద్ద పనులు ప్రారంభం కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.