News March 14, 2025
GWL: ‘ప్రతి ఒక పౌరుడికి ఓటు హక్కు కల్పించాలి’

హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణ జిల్లాలో ప్రతి 3 నెలలకు ఒకసారి పకడ్బందీగా అప్ డేట్ కావాలని, నూతనంగా 18 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రతి ఒక పౌరుడికి ఓటు హక్కు కల్పించాలని అన్నారు. ఈ కాన్ఫరెన్స్లో గద్వాల జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొన్నారు.
Similar News
News February 26, 2026
గద్వాల కలెక్టర్గా రిజ్వాన్ బాషా

జోగులాంబ గద్వాల జిల్లాకు కొత్త కలెక్టర్గా రిజ్వాన్ బాషా నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు జనగామ జిల్లా కలెక్టర్గా సేవలందించిన ఆయన, ఇకపై గద్వాల జిల్లా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక్కడ పనిచేసిన బి.ఎం.సంతోష్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో రిజ్వాన్ను ప్రభుత్వం నియమించింది.
News February 26, 2026
గొప్ప మనసు.. HYDలో ఆకలి తీర్చే చేతులెన్నో!

ఇంటికి వచ్చిన వారికి మంచినీళ్లు పోసే గుణం మన సొంతం. అలాంటిది మనోళ్లు HYDలో ఆకలితో అలమటిస్తున్నవారికి కడుపునిండా బువ్వ పెట్టే చేతులయ్యారు. సికింద్రాబాద్, మెహిదీపట్నం, రెడ్హిల్స్, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో నిత్యం పేదల కడుపు నింపేందుకు అన్నదాన వితరణ చేస్తుంటారు. వ్యాపారవేత్తల నుంచి విద్యార్థుల వరకు తమ చేతికి తోచిన సాయం చేసి, ఎంతో మంది కడుపు నింపుతున్నారు. గొప్ప మనసని కీర్తిస్తున్నారు..
News February 26, 2026
తరచూ ఈ టెస్టులు చేయించుకోవడం బెటర్!

ఆరోగ్య సంరక్షణలో భాగంగా కొన్ని కీలకమైన వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా CBC ద్వారా రక్తహీనతను, HbA1cతో షుగర్ లెవల్స్ను గుర్తించవచ్చు. LFT లివర్ పనితీరును, KFT కిడ్నీ ఆరోగ్యాన్ని తెలుపుతాయి. విటమిన్ D ద్వారా బోన్ హెల్త్, గుండె పనితీరుకు ECG, Lipid Profile టెస్టులు కీలకం. విటమిన్ లోపాలు, థైరాయిడ్ సమస్యలను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. SHARE IT


