News February 4, 2025
GWL: మరో రెండు రోజులే మిగిలింది..!

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఫిబ్రవరి 1న చివరి తేది ఉండగా.. ప్రభుత్వం దరఖాస్తు చివరి తేదీని ఫిబ్రవరి 6 వరకు పొడిగించింది. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేయనట్లయితే చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత శాఖ నాగర్కర్నూల్ జిల్లా అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News November 11, 2025
ఈసారి జూబ్లీహిల్స్ ఆదర్శం కావాలి.. ఓటెత్తి తీరాలి..!

2009లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక మంది ఓటేసింది ఎప్పుడంటే 2009లోనే.. అప్పుడు 52 శాతం మంది ఓటు వేశారు. ఆ తరువాత ఈ ఓటింగ్ శాతం తగ్గుతూ వస్తోంది. ఈ ఉపఎన్నికలో ఓటింగ్ శాతం పెరుగుతుందని అందరూ భావిస్తున్నారు. ప్రతి ఎన్నికల ముందూ ఇలానే అనుకుంటారు. కానీ అలా జరగడం లేదు. మరి నేడైనా అందరూ పోలింగ్ కేంద్రాలకు కదలి ఓటెత్తి ఆదర్శంగా నిలవాలి.
News November 11, 2025
ఈసారి జూబ్లీహిల్స్ ఆదర్శం కావాలి.. ఓటెత్తి తీరాలి..!

2009లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక మంది ఓటేసింది ఎప్పుడంటే 2009లోనే.. అప్పుడు 52 శాతం మంది ఓటు వేశారు. ఆ తరువాత ఈ ఓటింగ్ శాతం తగ్గుతూ వస్తోంది. ఈ ఉపఎన్నికలో ఓటింగ్ శాతం పెరుగుతుందని అందరూ భావిస్తున్నారు. ప్రతి ఎన్నికల ముందూ ఇలానే అనుకుంటారు. కానీ అలా జరగడం లేదు. మరి నేడైనా అందరూ పోలింగ్ కేంద్రాలకు కదలి ఓటెత్తి ఆదర్శంగా నిలవాలి.
News November 11, 2025
జిల్లాలో 58,451 MTల ధాన్యం సేకరణ పూర్తి

సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు 58,451 MTల ధాన్యాన్ని సేకరించారు. IKP, PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 225 కొనుగోలు కేంద్రాల్లో 9,155 మంది రైతుల నుంచి రూ.139.64 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రులతో నిన్న జరిగిన వీసీలో జిల్లాధికారులు వెల్లడించారు. 2,362 మంది రైతులకు రూ.37.01 కోట్లు చెల్లించామన్నారు. జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో 2.70 లక్షల MTల ధాన్యం సేకరించనున్నామన్నారు.


