News February 28, 2025

GWL: మహిళల రక్షణే షీ టీమ్స్ లక్ష్యం: ఎస్పీ 

image

మహిళల రక్షణ షీ టీమ్స్ ప్రధాన లక్ష్యమని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మహిళలపై జరిగే వేధింపులకు అడ్డుకట్ట వేయడంలో మల్టీ జోన్- 2 జిల్లాలలో జనవరి నెలలో గద్వాల షీ టీమ్స్ బృందం ఉత్తమ ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచిందన్నారు. జనవరిలో 14 ఫిర్యాదులు స్వీకరించి, 13 మందిని పట్టుకుని, 1FIR, 13 పెట్టి కేసులు నమోదు చేసిందని ప్రశంసించారు.

Similar News

News March 18, 2025

RR కలెక్టరేట్‌లో 72 ఫిర్యాదులు స్వీకరణ

image

ప్రజావాణి ఆర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ప్రజావాణిలో ఫిర్యాదుదారులు అందజేసిన ఆర్జీలను జిల్లా రెవెన్యూ అధికారి సంగీతతో కలసి స్వీకరించారు. అధికారులు తక్షణమే స్పందిస్తూ వెంటనే పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. రెవెన్యూ 40, ఇతర శాఖల్లో 32, మొత్తం 72 ఫిర్యాదులు స్వీకరించారు.

News March 17, 2025

పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్స్‌ ఏర్పాటుకు అనుమతి

image

పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్స్‌ ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది. 2 కాంప్లిమెంటరీ స్టాళ్ల ఏర్పాటుకు లోక్‌సభ సచివాలయం అనుమతి ఇచ్చింది. సంగం, నలంద లైబ్రరీ వద్ద వాటిని ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు AP MP కలిశెట్టికి లోక్‌సభ డిప్యూటీ కార్యదర్శి అజిత్ లేఖ రాశారు. అరకు కాఫీకి ప్రచారం కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు TDP ఎంపీలు గతంలో లోక్‌సభ స్పీకర్‌ను కోరగా తాజాగా అనుమతి లభించింది.

News March 17, 2025

రాష్ట్రపతి అల్పాహార విందులో బైరెడ్డి శబరి

image

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆతిథ్యంలో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రపతికి నమస్కారం చేశారు. రాష్ట్రపతి ఆహ్వానాన్ని ఎంతో గౌరవంగా, స్ఫూర్తిదాయకంగా భావిస్తున్నాని శబరి తెలిపారు.

error: Content is protected !!