News April 5, 2025
GWL: రైలు నుంచి పడి వ్యక్తి మృతి

ప్రమాదవశాత్తు రైలులో నుంచి పడి వ్యక్తి మృతిచెందిన ఘటన ఇటిక్యాలలో జరిగింది. స్థానికుల వివరాలు.. పూడురు-ఇటిక్యాల రైల్వేస్టేషన్ మధ్యలో ఓ 45ఏళ్ల వ్యక్తి గురువారం రాత్రి రైలులో నుంచి కిందపడి మృతి చెందారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు మృతదేహాన్ని గద్వాల మార్చురీకి తరలించారు.
Similar News
News December 5, 2025
పంచాయతీ ఎన్నికలు.. తొలి విడతలో 395 స్థానాలు ఏకగ్రీవం

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 4,236 సర్పంచ్ స్థానాలకు గాను 395 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 39 స్థానాలు ఉన్నాయి. అటు సీఎం రేవంత్ నియోజకవర్గం కొడంగల్లో 26 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. ఓవరాల్గా 5 గ్రామాల్లో నామినేషన్లు దాఖలవ్వలేదు. మిగిలిన 3,836 స్థానాలకు ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. కాగా మూడో విడత ఎన్నికల నామినేషన్ గడువు నేటితో ముగియనుంది.
News December 5, 2025
వరంగల్ స్మార్ట్ సిటీ పనుల్లో జాప్యం.. సీఎం దృష్టి పెడతారా?

ఎంపీ ఎన్నికల సందర్భంగా వరంగల్ అభివృద్ధికి CM రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల్లో అనేక పనులు ఇంకా నిలిచిపోయాయి. మామునూరు ఎయిర్పోర్టు భూసేకరణకు రూ.150 కోట్లు, భద్రకాళి చెరువు పూడికతీత, మాడ వీధులు, స్మార్ట్సిటీ పనులు, అండర్గ్రౌండ్ డ్రెయినేజీ డీపీఆర్ సహా మొత్తం రూ.6,500 కోట్ల ప్రాజెక్టులు పురోగతి లేక నిలిచాయి. ఔటర్, ఇన్నర్ రింగ్రోడ్లు, మేడారం, గిరిజన వర్సిటీకి నిధులు త్వరగా విడుదల చేయాలని కోరుతున్నారు.
News December 5, 2025
విశాఖ: నమ్మించి రూ.1.97 కోట్లు కాజేశారు

మహిళను నమ్మించి ఆన్లైన్లో రూ.1.97 కోట్ల పెట్టుబడి పెట్టించి మోసం చేసిన తండ్రి కొడుకును 1 టౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. సదరం శివ, ప్రేమ సాగర్ అక్కయ్యపాలెంకు చెందిన రమ్య రాజాకు ఆశ చూపించి ఆన్లైన్లో పెట్టుబడి పెట్టించడంతో పాటు 75 తులాల బంగారాన్ని తాకట్టు పెట్టించి డబ్బులు కాజేశారు. తన డబ్బులు ఇవ్వమని రమ్య అడగటంతో ఇబ్బందులకు గురి చేయాగా ఆమె పోలీసులును ఆశ్రయించారు


