News March 13, 2025
GWL: విద్యార్థుల భవిష్యత్తుకు సెమినార్లు కీలకం: కలెక్టర్

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సెమినార్లు అత్యంత కీలకమని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని MALD ప్రభుత్వ కళాశాలలో “వృక్ష జీవితం, మానవ సంక్షేమంపై జీవ విజ్ఞాన దృక్పథాలు” అన్న అంశంపై నిర్వహించిన సెమినార్ లో పాల్గొన్నారు. విద్యార్థులు పుస్తకాల్లో నేర్చుకునే విషయాలు నిజజీవితంలో ప్రయోగించి సమాజానికి ఉపయోగపడేలా చేయాలన్నారు. సెమినార్ల ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవాలన్నారు.
Similar News
News December 2, 2025
ఎన్నికల ఖర్చులకు కొత్త ఖాతా తప్పనిసరి: కలెక్టర్ తేజస్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయ వివరాల నమోదు కోసం తప్పనిసరిగా నూతన బ్యాంకు ఖాతా తెరవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి అభ్యర్థి ప్రత్యేక ఖాతా కలిగి ఉండాలన్నారు. మూడో విడతలో నామినేషన్ వేయాలనుకునే వారు ముందుగానే కొత్త అకౌంట్ తీసుకుంటే నామినేషన్ ప్రక్రియ సులభమవుతుందని కలెక్టర్ సూచించారు.
News December 2, 2025
‘పాలమూరు ప్రాజెక్టులను గాలికొదిలేశారు’

సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధిఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తిచేసి సాగునీరు ఇవ్వాలని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మక్తల్ బహిరంగ సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి స్పందించారు. మాటలు కోటలు దాటుతున్నాయని, రెండేళ్ల పాలనలో ఒక్క పని కూడా చేసింది లేదని విమర్శించారు. రైతులను గాలికి వదిలేసి బోనస్ అని బోగస్ మాటలతో మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<


