News March 21, 2025

GWL: సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు:DAO

image

కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ యాంత్రీకరణ ఉప పథకం కింద సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందిస్తున్నట్లు గద్వాల జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్ శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు చిన్న, సన్నకారు మహిళా రైతులు, ఎస్టీ మహిళా రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాకు రూ. 56.88 లక్షలు మంజూరు అయ్యాయని తెలిపారు. అవకాశాన్ని అర్హత గల రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News October 15, 2025

నెల్లూరులో మరోసారి యూరియా కొరత..?

image

నెల్లూరు జిల్లాలో రైతులకు ఎకరాకు 3బస్తాల చొప్పున యూరియానే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. 6బస్తాలు కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో 3.50 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన 94 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. అధికారులు 74 వేల మెట్రిక్ టన్నులకే ప్రతిపాదనలు పంపారు. 20వేల మెట్రిక్ టన్నుల కొరత ఏర్పడితే యూరియా కోసం రైతులు అవస్థలు పడక తప్పదు.

News October 15, 2025

కామన్‌వెల్త్ గేమ్స్: ఈ విషయాలు తెలుసా?

image

కామన్‌వెల్త్ <<18015617>>క్రీడలు<<>> 1930లో ‘బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్’ పేరుతో కెనడాలోని హామిల్టన్‌లో తొలిసారి జరిగాయి. ఆ తర్వాత బ్రిటిష్ ఎంపైర్ అండ్ కామన్‌వెల్త్ గేమ్స్(1954-1966), బ్రిటిష్ కామన్‌వెల్త్ గేమ్స్(1970-1974)గా మారాయి. 1978 నుంచి కామన్‌వెల్త్ గేమ్స్‌గా పిలుస్తున్నారు. బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్రం పొందినవి ఇందులో సభ్యదేశాలుగా ఉన్నాయి. 2022లో ఇందులో 53 సభ్యదేశాలు ఉండగా 72 దేశాలు క్రీడల్లో పాల్గొన్నాయి.

News October 15, 2025

విజయనగరం జిల్లా రైతులకు విజ్ఞప్తి

image

పత్తి, మొక్కజొన్న పంటలకు కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు విక్రయించవద్దని జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ అధికారి రవికిరణ్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సంవత్సరానికి పత్తి ధర క్వింటాల్‌కు రూ.8110, మొక్కజొన్న క్వింటాల్‌కు రూ.2400గా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అక్టోబరు 21 తర్వాత జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. రైతుల ప్రయోజనాలను కాపాడటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.