News April 3, 2025
GWL: ‘సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడుతాం’

అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం చేస్తామని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ గద్వాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఇందిర, వెంకట్రామమ్మ పేర్కొన్నారు. గురువారం గద్వాలలో జరిగిన అంగన్వాడీ వర్కర్ల సమావేశంలో నూతన జిల్లా కమిటీ ఎన్నుకున్నారు. కోశాధికారి లక్ష్మీ రంగమ్మ, ఉపాధ్యక్షురాలు గిరిజ, సభ్యులుగా చిట్టెమ్మ, కృష్ణవేణిని ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వారిని అభినందించారు.
Similar News
News April 18, 2025
పెద్దపల్లికి చేరుకున్న నాగస్వాముల బృందం

మధురై నుంచి రామేశ్వరం వెళ్తున్న నాగస్వాముల బృందం శుక్రవారం ఉదయం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా హైవే వద్దకు చేరుకుంది. లోక కళ్యాణం కోసం మధురై నుంచి రామేశ్వరం వరకు ప్రయాణం చేస్తున్నట్లుగా నాగస్వాములు పేర్కొన్నారు. 15 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ ప్రయాణంలో అనేక ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తున్నామని అన్నారు.
News April 18, 2025
నెల్లూరు: ప్రజలకు ఈకేవైసీ కష్టాలు

రేషన్ కార్డుదారులకు మరోసారి ఈకేవైసీ కష్టాలు వచ్చాయి. గతంలో ఈకేవైసీని వైసీపీ ప్రభుత్వం చేపట్టింది. సరిగా వేలిముద్రలు పడని వారివి ప్రస్తుతం పెండింగ్ చూపిస్తున్నాయి. కొత్త రేషన్ కార్డుల జారీలోనూ సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పిల్లలు, పెద్దలకు ఈకేవైసీ పూర్తిచేయాలని భావించింది. పొదలకూరు మండలంలోనే 6,125 మందికి ఈకేవైసీ పెండింగ్ ఉన్నట్లు సివిల్ సఫ్లై డీటీ రవికుమార్ తెలిపారు.
News April 18, 2025
BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

AP: కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. హిందూపురానికి చెందిన నాగరాజు, నాగభూషణ్, మురళి, సోమలు యాద్గిర్(KA) జిల్లా షహర్పూర్కు బొలెరోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రక్కును వీరి వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో వీరంతా అక్కడికక్కడే మృతిచెందారు.