News April 3, 2025
GWL: ‘సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడుతాం’

అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం చేస్తామని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ గద్వాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఇందిర, వెంకట్రామమ్మ పేర్కొన్నారు. గురువారం గద్వాలలో జరిగిన అంగన్వాడీ వర్కర్ల సమావేశంలో నూతన జిల్లా కమిటీ ఎన్నుకున్నారు. కోశాధికారి లక్ష్మీ రంగమ్మ, ఉపాధ్యక్షురాలు గిరిజ, సభ్యులుగా చిట్టెమ్మ, కృష్ణవేణిని ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వారిని అభినందించారు.
Similar News
News September 19, 2025
పార్టీ ఫిరాయింపు.. MLA సంజయ్కు మళ్లీ నోటీసులు!

పార్టీ ఫిరాయింపుపై JGTL MLA సంజయ్కు స్పీకర్ గడ్డం ప్రసాద్ మరోసారి నోటీసులు పంపారు. BRSలోనే కొనసాగుతున్నానని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే CMని కలిశానని, పార్టీ మారలేదని సంజయ్ మునుపటి నోటిసుకు వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సంతృప్తి చెందని స్పీకర్ మరిన్ని స్పష్టమైన ఆధారాలు కావాలని కోరారు. కాగా, MLAల పార్టీ ఫిరాయింపుపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్ను ఆదేశించింది.
News September 19, 2025
రైల్వేకు ‘మహిళా శక్తి’ని పరిచయం చేసిన సురేఖ

ఆడవాళ్లు రైలు నడుపుతారా? అనే ప్రశ్నలను, అడ్డంకులను దాటుకుని ఆసియాలోనే తొలి మహిళా లోకోపైలట్గా మారిన సురేఖా యాదవ్(మహారాష్ట్ర) పదవీ విరమణ పొందారు. ఆమె తన అసాధారణ ప్రయాణంలో ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. 1988లో అసిస్టెంట్ లోకోపైలట్గా మొదలైన ఆమె ప్రయాణం డెక్కన్ క్వీన్ రైళ్లను నడిపే వరకూ సాగింది. ఆమె ఉద్యోగ జీవితం భారతీయ రైల్వేలో మహిళా సాధికారతకు చిహ్నంగా నిలిచిపోతుంది.
News September 19, 2025
NZB: 250కిపైగా పిల్లలున్నా.. లేని ప్రభుత్వ టీచర్..!

రుద్రూర్ మండలం సులేమాన్ నగర్లోని MPPS ఉర్దూ మీడియం HM అఫ్సర్ మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన సందర్భంగా ఆయన్ను గురువారం మాజీ MPTC గౌస్, స్కూల్ సిబ్బంది, గ్రామస్థులు సన్మానించారు. అయితే ఈ స్కూల్లో 250కిపైగా విద్యార్థులున్నా వీరికి గణితం, తెలుగు బోధించేందుకు టీచరే లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలో పిలలకు నష్టం జరగకుండా గౌస్ 2024 నుంచి నెలకు రూ.3,000 జీతం ఇస్తూ ఓ మహిళా టీచర్తో చదువు చెప్పిస్తున్నారు.