News April 3, 2025
GWL: ఈత సరదా.. ముగ్గురి ప్రాణం తీసింది!

ఈతకెళ్లి మునిగిపోయి ముగ్గురు మృతిచెందిన ఘటన నిన్న రాజోళి మండలంలో జరిగింది. ఏపీలోని కర్నూలు లక్ష్మీనగర్కు చెందిన సులేమాన్(47) కుటుంబంతో కలిసి సుంకేసులడ్యామ్కు వచ్చారు. కొడుకులు ఫర్హాన్(11), ఫైజాన్(9)లతో కలిసి సరదాగా ఈతకొట్టేందుకు దిగారు. ప్రమాదవశాత్తు కొడుకులిద్దరూ నీటిలో మునిగిపోయారు. గమనించిన తండ్రి కాపాడేందుకు వెళ్లగా, ఆయనా మునిగిపోయారు. పోలీసుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు.
Similar News
News November 9, 2025
HYD: KTRను చెత్తకుండికి కట్టేయండి: CM రేవంత్

జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో ‘చెత్త’ చుట్టూ రాజకీయం ఆగడం లేదు. తాజాగా CM రేవంత్ KTRకు కౌంటర్ వేశారు. ‘ఆడ చెత్త ఉంది.. ఈడ చెత్త ఉంది అంటున్నారు. 3 సార్లు BRS MLA ఉండు. మున్సిపల్ మిన్సిస్టర్ KTR, MPగా కిషన్ రెడ్డి ఉండు. ఇన్నేళ్లు ఏం చేశారు? తోడు దొంగలు మీరే. మా ప్రాతినిథ్యం లేని చోట జవాబు చెప్పమనడం ఏంటి?. చెత్తకుండిని చూసి KTRను అక్కడ కట్టేయండి. ఆయనకు తత్వం అయినా బోధపడుతది’ అంటూ CM వ్యాఖ్యానించారు.
News November 9, 2025
HYD: KTRను చెత్తకుండికి కట్టేయండి: CM రేవంత్

జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో ‘చెత్త’ చుట్టూ రాజకీయం ఆగడం లేదు. తాజాగా CM రేవంత్ KTRకు కౌంటర్ వేశారు. ‘ఆడ చెత్త ఉంది.. ఈడ చెత్త ఉంది అంటున్నారు. 3 సార్లు BRS MLA ఉండు. మున్సిపల్ మిన్సిస్టర్ KTR, MPగా కిషన్ రెడ్డి ఉండు. ఇన్నేళ్లు ఏం చేశారు? తోడు దొంగలు మీరే. మా ప్రాతినిథ్యం లేని చోట జవాబు చెప్పమనడం ఏంటి?. చెత్తకుండిని చూసి KTRను అక్కడ కట్టేయండి. ఆయనకు తత్వం అయినా బోధపడుతది’ అంటూ CM వ్యాఖ్యానించారు.
News November 9, 2025
కేసీఆర్ తెచ్చిన ఏ పథకాన్నీ రద్దు చేయలేదు: CM రేవంత్

TG: KCR తెచ్చిన ఏ పథకాన్నీ తాను రద్దు చేయలేదని, వాటికి అదనంగా మరిన్ని స్కీమ్స్ అమలు చేస్తున్నట్లు CM రేవంత్ తెలిపారు. నాడు అభివృద్ధిని పక్కనపెట్టి ఎలాంటి ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయం, ప్రగతిభవన్ మాత్రమే నిర్మించారని విమర్శించారు. ‘నేను SC వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రంగా నిలిపాను. కులగణన చేసి చూపించా. రాష్ట్ర గీతాన్ని అందించా. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించా’ అని రేవంత్ వివరించారు.


