News July 10, 2025
GWL: ‘కల్తీ’ కల్లోలం సృష్టించక ముందే మేల్కొందాం..!

HYDలో కల్తీకల్లు కల్లోలం సృష్టించింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. పాలమూరులో సైతం కల్తీకల్లు తాగి గతంలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. HYD ఘటనతో జిల్లాలో అధికారులు వీటిపై దృష్టిపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. 2023 సం. ప్రకారం ఉమ్మడి MBNRలో కల్లుగీత కార్మిక సహకార సంఘాల కల్లు డిపోల సంఖ్య 321గా ఉంది. 772 మందికి లైసెన్సులున్నాయి. 2020-23లో కల్తీ కారణంగా ఐదుగురు చనిపోగా, సుమారు 60 మంది అస్వస్థతకు గురయ్యారు.
Similar News
News July 11, 2025
కొమురవెల్లి మల్లన్న ఆదాయం రూ.1,04,35,711

కొమురవెల్లి మల్లికార్జున స్వామి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు గురువారం లెక్కించారు. స్వామి వారికి 55 రోజుల్లో రూ.1,04,35,711 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి అన్నపూర్ణ తెలిపారు. 120 గ్రాముల మిశ్రమ బంగారం, 6.100 కిలోల మిశ్రమ వెండి, 42 విదేశీ నోట్లు, మిశ్రమ బియ్యం 16 క్వింటాలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, పోలీస్ సిబ్బంది, SBI బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
News July 11, 2025
మద్దూర్: పురుగుమందు తాగి మహిళ ఆత్మహత్య

ఓ మహిళ పురుగుమందు తాగి మృతి చెందిన ఘటన మద్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధమగ్నాపూర్లో చోటుచేసుకుంది. ఎస్ఐ విజయ్ తెలిపిన వివరాలు.. ఈనెల 8వ తేదీన గ్రామానికి చెందిన జోగు మౌనిక ఆర్థిక(35) ఇబ్బందులతో పురుగుమందు తాగింది. చికిత్స కుటుంబసభ్యులు నిమిత్తం HYD నిమ్స్కి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. ఈమేరకు కేసు నమోదైంది.
News July 11, 2025
ఏటూరునాగారం: GREAT.. 2 కి.మీ నడిచి వైద్య శిబిరం

జ్వరం వస్తే ఆసుపత్రికి రావాలని, సొంత చికిత్సలు చేసుకోవద్దని ఏటూరునాగారం మండలం గంటలకుంట గుత్తికోయలకు వైద్యాధికారి సుమలత సూచించారు. గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో సుమారు 2 కి.మీ నడిచి హెల్త్ క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు. క్యాంపులో 28 మందికి పరీక్షలు నిర్వహించి, జ్వరాల బారిన పడ్డ ఐదుగురికి మందులను పంపిణీ చేశామన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించినట్లు పేర్కొన్నారు.