News September 13, 2025
GWL: కేటీఆర్ సభకు గద్వాల ఎమ్మెల్యే హాజరవుతారా?

గద్వాల నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లు సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు గద్వాలలో జరిగే కేటీఆర్ బహిరంగ సభకు ఆయన హాజరవుతారా లేదా అనేది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఉత్కంఠ నెలకొంది.
Similar News
News April 14, 2026
DANGER: వేసవిలో ఇవి తింటే..

సమ్మర్లో అధిక నూనె ఉండే బజ్జీలు, పకోడీలు, చిప్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్కు దూరంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వీటి వల్ల అలసట, ఎసిడిటీ వస్తాయని, జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందని తెలిపారు. అలాగే స్వీట్లు, ప్యాకేజ్డ్ జ్యూసులు, షుగర్ ఎక్కువగా ఉండే కూల్డ్రింక్స్ తాగొద్దని, వీటి వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రాసెస్ చేసిన, ప్యాకేజ్డ్ ఫుడ్స్ కూడా ఆరోగ్యానికి ప్రమాదకరమని సూచించారు.
News April 14, 2026
ఒంటిమిట్టలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత

AP: కడప(D) ఒంటిమిట్టలో ఇవాళ 45°C ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల(D) సంజామల 44.2°C, తిరుపతి(D) వరదయ్యపాలెంలో 43.8°C ఉష్ణోగ్రత నెలకొంది. 262 మండలాల్లో 40°Cలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు SDMA MD ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో 42-44°C మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయన్నారు. ఉత్తరాంధ్రలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ఎండతీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.



