News March 5, 2025

GWL: నీట్ యూజీ-2025 కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు: కలెక్టర్

image

జోగులాంబ గద్వాల్ జిల్లా పరిధిలో మే 4న నిర్వహించనున్న నీట్ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బియం. సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి గద్వాల్ పరిధిలోని ఎస్ఆర్. విద్యానికేతన్ (గద్వాల్), సరస్వతి స్కూల్ (ఎర్రవల్లి) పరీక్షా కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. గదుల వసతులు సీటింగ్ ఏర్పాట్లు సీసీటీవీ పర్యవేక్షణ వెంటిలేషన్ తదిత అంశాలను పరిశీలించారు.

Similar News

News December 15, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గోల్డ్ రేట్స్ ఇవాళ కూడా భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.820 పెరిగి రూ.1,34,730కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.750 ఎగబాకి రూ.1,23,500 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.3,000 పెరిగి రూ.2,13,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 15, 2025

WGL: కాంగ్రెస్ 545, BRS 336, BJPకి 29 జీపీలు!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే పైచేయిగా ఉంది. మొదటి, రెండో దశలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 545 పంచాయతీలకు గెలువగా, బీఆర్ఎస్ 336, బీజేపీ 29, ఇతరులు 98 పంచాయతీలను గెలుచుకున్నారు. ఉమ్మడి జిల్లాలో తొలిసారి బీజేపీ 29 జీపీలను గెలిచి తన ఖాతాను తెరవగా, మిగిలిన 3వ దశపై మూడు పార్టీలు గురి పెట్టాయి. బీఆర్ఎస్ రెండో విడతలో కాస్త మెరుగైన ఫలితాలనే సాధించింది.

News December 15, 2025

అంచనాలను అందుకోని రబీ సాగు

image

AP: గత కొన్ని నెలలుగా వర్షాభావం, అధిక వర్షాల ప్రభావం ప్రస్తుత రబీ సీజన్‌పై ప్రభావం చూపింది. 2 నెలలు గడుస్తున్నా రబీ సాగు అంచనాలను అందుకోలేదు. ఈ సీజన్‌లో 20.70 లక్షల హెక్టార్లలో 22 రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా, 6.57 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటల సాగు జరుగుతోంది. వరి 1.33 లక్షలు, చిరుధాన్యాలు 1.21 లక్షలు, నూనెగింజలు 0.21 లక్షలు, అపరాలు 3.44 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగవుతున్నాయి.