News January 23, 2026

GWL: నీళ్ల కోసం వెళ్లి.. బావిలో విగతజీవిగా తేలి.!

image

గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని పొలంలో నీటి కోసం బావిలోకి దిగిన జయమ్మ (38) అనే మహిళ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందింది. బొచ్చువీరాపురం గ్రామానికి చెందిన జయమ్మ, తన భర్తతో కలిసి పొలానికి వెళ్లి నీళ్లు తెచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. భర్త వెళ్లి చూసేసరికి ఆమె బావిలో విగతజీవిగా కనిపించింది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, ఈ ఘటనపై ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని కోదండాపురం ఎస్సై తెలిపారు.

Similar News

News February 21, 2026

వాసుదేవరెడ్డికి ఈ నెల 27 వరకు రిమాండ్

image

AP: లిక్కర్ స్కామ్ కేసు నిందితుడు <<19203084>>వాసుదేవరెడ్డికి<<>> విజయవాడ ACB కోర్టు ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను గుంటూరు జైలుకు తరలించనున్నారు. అంతకుముందు కోర్టులో విచారణ సందర్భంగా సిట్ విచారణకు వాసుదేవరెడ్డి సహకరిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. అప్రూవర్‌గా మారారని, అత్యవసరంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని వాదించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉందని చెప్పారు.

News February 21, 2026

WGL: ఇసుక దందా అడ్డుకట్టకు చెక్ పోస్టులు..!

image

వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు మళ్లీ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. గత కొన్ని నెలల నుంచి సక్రమంగానే ఇసుక రవాణాకు సహకరించిన పోలీసులు అకస్మాత్తుగా చెక్ పోస్టులు పెట్టడంపై చర్చ జరుగుతోంది. ఇటీవల ఐనవోలు మండలం నందనంలో జడ్పీ మాజీ వైస్ ఛైర్మన్‌పై దాడి, ఓ ప్రజాప్రతినిధి మామూళ్ల వసూళ్లపై సీరియస్‌గా చర్చ జరగడంతో ఈ అడ్డుకట్ట వేస్తున్నట్లు తెలుస్తోంది.

News February 21, 2026

రావులపాడు కాలువలో మృతదేహం కలకలం

image

రావులపాడు వద్ద బొబ్బర్లంక ముక్కామల ప్రధాన పంట కాలువలో సుమారు 50–55 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం శనివారం లభ్యమైంది. స్థానిక వీఆర్వో ఇచ్చిన సమాచారంతో రావులపాలెం టౌన్ ఎస్సై రమణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుని వివరాలు తెలిసిన వారు వెంటనే పోలీసులను సంప్రదించాలని ఎస్సై కోరారు.