News February 4, 2025

GWL: నేటి నుంచి జమ్ములమ్మ బ్రహ్మోత్సవాలు

image

నడిగడ్డ ప్రజల ఆరాధ్య దైవం జమ్మిచేడు జమ్ములమ్మ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 12 వరకు జరగనున్నాయి. జమ్ములమ్మ మెట్టినిల్లు అయిన గుర్రం గడ్డ దీవి నుంచి ఎద్దుల బండి పై బుధవారం అమ్మవారి విగ్రహాన్ని జమ్మిచేడు ఆలయానికి తీసుకువస్తారు. పది రోజులపాటు జరిగే ఉత్సవాల్లో వివిధ రాష్ట్రాల భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకోనున్నారు. మరి ఈ బ్రహ్మోత్సవాలకు మీరెళ్తున్నారా.?

Similar News

News September 19, 2025

రాష్ట్రంలో రెండు కొత్త పథకాలు ప్రారంభం

image

TG: రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం 2 కొత్త పథకాలు ప్రారంభించింది. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పేరుతో ఒంటరి మహిళలు, వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, అనాథ మహిళలకు రూ.50,000 ఆర్థిక సాయం అందించనుంది. ‘రేవంతన్నా కా సహారా’ కింద ఫకీర్, దూదేకుల వంటి వెనుకబడిన వర్గాలకు రూ.లక్ష గ్రాంట్‌తో మోపెడ్స్ ఇవ్వనుంది. అర్హులు నేటి నుంచి OCT 6 వరకు <>tgobmms.cgg.gov.in<<>>లో దరఖాస్తు చేసుకోవచ్చు.

News September 19, 2025

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. శుక్రవారం గుడిపాల మండలం చలి చీమల పల్లి వద్ద జరిగే నేషనల్ హైవే పనులను పరిశీలించారు. చెరువు వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు నీటి ప్రవాహాన్ని పరిశీలించి, సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి నష్టం జరగకుండా చూడాలన్నారు.

News September 19, 2025

గంజాయి రహిత జిల్లా నిర్మాణానికి కృషి చేయాలి: ADB ఎస్పీ

image

గంజాయి రహిత జిల్లా నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గురువారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. వీడీసీల ఆగడాలను పూర్తిస్థాయిలో అరికట్టాలన్నారు. రౌడీలు, కేడీలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా కఠినమైన పర్యవేక్షణ చేయాలని సూచించారు. దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు.