News March 1, 2025
GWL: పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరపాలి: కలెక్టర్

పదవ తరగతి పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని గద్వాల జిల్లా కలెక్టర్ బియం.సంతోష్ అధికారులకు ఆదేశించారు. ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్ నందు పదవ తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ రాసే లాగా చేయాలని అన్నారు.
Similar News
News February 26, 2026
ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్గా ముగిశాయి. రోజంతా ఒడుదొడుకులకు లోనయ్యాయి. సెన్సెక్స్ 27 పాయింట్ల నష్టంతో 82,249 వద్ద, నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 25,497 వద్ద సెటిలయ్యాయి. సెన్సెక్స్లో BEL, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, మారుతీ సుజుకీ, ఎయిర్టెల్ షేర్లు లాభపడ్డాయి. ట్రెంట్, ఎటర్నల్, పవర్ గ్రిడ్, HDFC బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టపోయాయి.
News February 26, 2026
ఆ గ్రామాలకు పథకాన్ని అమలు చేయాలి- బాపట్ల కలెక్టర్

సౌర విద్యుత్ ఉత్పత్తి, వినియోగం పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలోని పిట్టలవానిపాలెంలో 12,036 గృహాలు, కొత్తపేటలో 16,931 గృహాలు, కారంచేడులో 11,667 గృహాలు, కనగాలలో 7,192 గృహాలు, యడ్లపల్లిలో 8,300 గృహాలు, రావినూతలలో 8,279 గృహాలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాన్ని వర్తింపచేయాలన్నారు.
News February 26, 2026
పార్వతీపురం: బాల్య వివాహాలు చేస్తే జైలుకే: కలెక్టర్

జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగినట్టు సమాచారం తెలిస్తే జరిపించిన తల్లిదండ్రులతో పాటు సర్పంచ్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి హెచ్చరించారు. గురువారం పార్వతీపురం కలెక్టరేట్లో ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. బాలికకు వివాహ వయసు రాకుండా వివాహం జరిపిన వారిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదుచేయాలని ఆదేశించారు.


