News January 27, 2025
GWL: పోలీస్ ప్రజావాణిలో 7 ఫిర్యాదులు: SP

గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 7 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. భూ వివాదాలకు సంబంధించి 4, ప్లాటు ఆక్రమణకు సంబంధించి 1, ఇతర అంశాలకు సంబంధించి 2 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత ఎస్సైలకు సూచించారు. ప్రజావాణి ద్వారా బాధితులకు న్యాయం చేసేందుకు జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందని చెప్పారు.
Similar News
News December 30, 2025
WPL: RCB నుంచి పెర్రీ ఔట్

JAN 9 నుంచి మొదలయ్యే WPLకు ముందు RCBకి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఎల్లీస్ పెర్రీ సీజన్కు దూరమయ్యారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. పెర్రీ ప్లేస్లో IND ఆల్రౌండర్ సయాలీ సత్ఘరేను తీసుకున్నట్లు RCB తెలిపింది. 2024లో బెంగళూరు టైటిల్ సాధించడంలో పెర్రీ కీ రోల్ పోషించారు. అటు అన్నాబెల్ సదర్లాండ్(ఢిల్లీ), తారా నోరీస్(యూపీ వారియర్స్) కూడా WPLకు దూరమయ్యారు.
News December 30, 2025
మంచిర్యాల: వార్డుల వారీగా ఓటర్ జాబితా వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలోని వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితా ఎలాంటి అవకతవకలు తావు లేకుండా స్పష్టంగా రూపొందించాలని ఆదేశించారు.
News December 30, 2025
NRPT: ప్రజా భద్రతే లక్ష్యం: ఎస్పీ

నేరాల నియంత్రణలో జిల్లా పోలీసులు సమర్థంగా పనిచేశారని ఎస్పీ డా. వినీత్ ఐపీఎస్ 2025 వార్షిక నివేదికలో వెల్లడించారు. జిల్లాలో గ్రేవ్ నేరాలు 22%, రేప్ & పోక్సో కేసులు 12.5% తగ్గాయని తెలిపారు. శాంతియుత ఎన్నికల నిర్వహణతో పాటు మహిళలు, బాలికల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు.


