News October 9, 2025

GWL: ప్రియాంక మృతిపై తండ్రి సంచలన ఆరోపణలు

image

గట్టు మండలం చిన్నోనిపల్లిలో 3 నెలలు న్యాయపోరాటం చేసిన ప్రియాంక మృతిపై ఆమె తండ్రి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, పథకం ప్రకారం పాయిజన్ ఇచ్చి చంపారని ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ నెల 3న రాత్రి 9:30కి మాట్లాడానని, కొద్దిసేపటికే పురుగుమందు తాగింది అంటూ ఫోన్ వచ్చిందని తెలిపారు. ఆసుపత్రిలో ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు.

Similar News

News October 9, 2025

సిద్దిపేట: కొండెక్కిన కొబ్బరికాయ ధర!

image

కొబ్బరికాయల ధర కొండెక్కి కూర్చొంది. చిన్న కాయ అయినప్పటికీ ఎన్నడూ లేని విధంగా ధర పలుకుతోంది. దీంతో కొబ్బరి కాయలను కొనాలంటేనే వినియోగదారులు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిద్దిపేట మార్కెట్లో చిన్న సైజ్‌ కొబ్బరికాయ ధర రూ.35 కాగా.. ఒక మోస్తరు సైజ్‌ కొబ్బరి ధర రూ.45 నుంచి రూ.50 వరకు పలుకుతోంది. ధర మునుపెన్నడు లేని విధంగా అమాంతంగా పెరగడంతో వినియోగదారులు అవసరమైతే తప్ప కొనడం లేదు.

News October 9, 2025

యాదాద్రి: కోతులను మాస్కులతో తరిమేస్తున్నారు.!

image

అడ్డగూడూరు మండలం కోటమర్తి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు నిత్యం కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ విద్యార్థులు భోజనం చేసే సమయంలో కోతులు విరుచుకుపడుతూ, దాడులు చేస్తున్నాయి. ఈ సమస్యను ఎదుర్కోవడానికి విద్యార్థులు గురువారం చింపాంజీ, సింహం ఆకారంలో ఉన్న మాస్కులు ధరించి, కోతులను తరిమికొట్టేందుకు వినూత్నంగా యత్నించారు. నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు.

News October 9, 2025

వైసీపీ నాయకులు చేసిన తప్పే టీడీపీ నేతలు చేస్తున్నారా?

image

YCP గత ఎన్నికల్లో ఘోర ఓటమి చెందడంలో కొందరు నాయకుల అసభ్యకర వ్యాఖ్యలే కారణమనే విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం అదే విధానాన్ని <<17940542>>TDPలో కొందరు ఎమ్మెల్యేలు<<>> అవలంభిస్తున్నారనే చర్చ మొదలైంది. కొడాలి, అంబటి, రోజా, వంశీ వంటి నాయకులు గతంలో అసభ్య పదజాలంతో మాట్లాడేవారు. జీడీ నెల్లూరు <<17949084>>ఎమ్మెల్యే థామస్<<>> చేసిన వ్యాఖ్యలు ఏంటని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇలాంటి బూతు రాజకీయాలు మానుకోవాలని ప్రజలు సూచిస్తున్నారు.