News March 14, 2025

GWL: మరమ్మత్తుల కంటే.. కొత్త మోటర్లు బెటర్.!

image

GWL జిల్లా వ్యాప్తంగా 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామాల్లో ప్రజలకు నీటి వసతి కల్పించడంలో గ్రామ పంచాయతీలు ముఖ్య పాత్ర నిర్వహిస్తున్నాయి. వేసవి కాలం మొదలైతే నీటి వనరులు అడుగంటి మోటర్లు స్టార్టర్లు పనిచేయవు. పాత వాటికీ మరమ్మతులు చేయించిన కొన్ని రోజులకే పాడౌతున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం పదే పదే రిపైర్స్ అయ్యే వాటి స్థానంలో కొత్త మోటార్లు ఏర్పాటు చేస్తే బాగా ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News September 16, 2025

ఎల్లారెడ్డిపేట: యాదవ హక్కుల పోరాట సమితి యూత్ జిల్లా అధ్యక్షుడిగా నాగరాజ్

image

యాదవ హక్కుల పోరాట సమితి యూత్ జిల్లా అధ్యక్షుడిగా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రానికి చెందిన మానుక నాగరాజ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కొక్కు దేవేందర్, మంగళవారం ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజ్ మాట్లాడుతూ.. యాదవుల సమస్యలపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. తన నియామకానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

News September 16, 2025

ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్యఅతిథిగా బీర్ల ఐలయ్య

image

జనగామ కలెక్టరేట్లో బుధవారం జరగనున్న ప్రజాపాలన దినోత్సవం ముఖ్యఅతిథిగా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరు కానున్నారు. ఉదయం 9.58 గంటలకు జనగామ కలెక్టరేట్‌కు చేరుకొని ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ప్రజాపాలన దినోత్సవాలకు కలెక్టరేట్ లో సభా ప్రాంగణం, తదితర ఏర్పాట్లు పూర్తి చేశారు.

News September 16, 2025

SRCL: ‘ఓటర్ జాబితా స్పెషల్ రివిజన్ కట్టుదిట్టంగా చేపట్టాలి’

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. 2022 సం. ఓటర్ల జాబితాతో తాజా జాబితాను పోల్చి, డూప్లికేట్, దొంగ ఓట్లను తొలగించాలని సూచించారు. ప్రతి బూత్ పరిధిలో ధృవీకరణ చేసి, సెప్టెంబర్ 22లోపు జాబితా సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహశీల్దార్లు పాల్గొన్నారు.